విధులకు హాజరుకావాలని కశ్మీర్ సర్కార్ హుకుం..
- August 20, 2016
కశ్మీర్లో కర్ఫ్యూ శనివారంతో 42వ రోజుకు చేరడంతో జనజీవనం స్తంభించింది. బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ అనంతరం తలెత్తిన అల్లర్లు కొనసాగుతుండటం, ఉద్రిక్త పరిస్థితులు సడలకపోవడంతో అనంతనాగ్ పట్టణం, శ్రీనగర్ సిటీలోని పలు ప్రాంతంలో కర్ఫ్యూ కొనసాగుతోందని, కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉన్నాయని పోలీసులు తెలిపారు. మరోవైపు, విధులకు హాజరుకావాలని, లేదంటే ఆగస్టు నెల జీతంలో వేతనంలో కోత విధిస్తామని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం హుకుం జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాలు సముచితంగా లేవని, నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందని వారంటున్నారు.మరోవైపు, శ్రీనగర్ ఓల్డ్ సిటీలోని నౌహట్టా ఏరియాలో ఉన్న జామా మసీదులో వరుసగా ఆరో రోజు కూడా ప్రార్థనలు జరగలేదు. సీఆర్పీఎఫ్ దళాల ఫైరింగ్లో మృతిచెందిన నలుగురు పౌరులకు నివాళులర్పించడానికి బుద్గావ్ జిల్లాలోని ఆరిపంతన్ గ్రామం వరకూ మార్చ్ జరిపాలని నిర్ణయించుకున్న వేర్పాటువాద నేతలు సైయద్ అలీ గిలానీ, మిర్వైజ్ ఉమర్ ఫరూక్లను ముందస్తుగా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







