ఇద్దరు బంగ్లాదేశీయులను రక్షించిన సౌదీ రెస్క్యూ టీమ్..!!
- September 10, 2026
మక్కా: సౌదీ అరేబియాలో సముద్రంలో బోటు మొరాయించడంతో చిక్కుకుపోయిన ఇద్దరు బంగ్లాదేశీయులను బోర్డర్ గార్డ్ సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు సురక్షితంగా రక్షించాయి. మక్కా ప్రాంతంలోని రబీఘ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. సముద్రంలో బోటు పనిచేయకుండా నిలిచిపోవడంతో ఇద్దరు బంగ్లాదేశీయులు ఇబ్బందుల్లో ఉన్నట్లు సమాచారం అందుకున్న అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకుని వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. అనంతరం అవసరమైన సహాయాన్ని అందించారు.
సముద్ర ప్రయాణాలు చేసే వారంతా భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సౌదీ అరేబియా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ బోర్డర్ గార్డ్ సూచించింది. బోటులో ప్రయాణం ప్రారంభించే ముందు అది సముద్ర ప్రయాణానికి అనువుగా ఉందో లేదో పూర్తిగా తనిఖీ చేసుకోవాలని పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో మక్కా, మదీనా, తూర్పు ప్రావిన్స్లలో 911కు, సౌదీ అరేబియాలోని ఇతర ప్రాంతాల్లో 994కు కాల్ చేయాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో వాడీ అల్-బుహైర్ మూసివేయలేదు..!!
- కువైట్లో నలుగురు భారతీయులు అరెస్ట్..!!
- ఒమన్లో డ్రగ్స్ అక్రమ రవాణాకు మరణశిక్ష, భారీ జరిమానాలు..!!
- ఇద్దరు బంగ్లాదేశీయులను రక్షించిన సౌదీ రెస్క్యూ టీమ్..!!
- 56% నెట్వర్క్ను పునరుద్ధరించిన ఎమిరేట్స్..!!
- 4 మిలియన్ల ప్రయాణికులకు సిద్ధమైన ఖతార్..!!
- ఇరాన్ యుద్ధం ముగింపు పై ట్రంప్ కీలక ప్రకటన
- యూఏఈలో పెట్టుబడుల కోసం ఒడిశా సీఎం మాఝీ దూకుడు.. రూ.2.1 లక్షల కోట్ల ఒప్పందం
- వినియోగదారుని పై బ్యాంకు చార్జీల భారం!
- శబరిమలలో ఇకపై రోజుకు 5 పడి పూజలు







