కువైట్లో నలుగురు భారతీయులు అరెస్ట్..!!
- September 10, 2026
కువైట్: అక్రమంగా మద్యం తయారు చేసి విక్రయిస్తున్నారనే ఆరోపణలపై నలుగురు భారతీయులను కువైట్ భద్రతా అధికారులు అరెస్ట్ చేశారు. అబ్దాలీ రోడ్డులోని ఎడారి ప్రాంతంలో ఉన్న ఓ ఫార్మ్లో ఈ అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. క్రిమినల్ సెక్యూరిటీ అఫైర్స్ సెక్టార్కు చెందిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం, జహ్రా గవర్నరేట్ దర్యాప్తు విభాగం అధికారులు ఈ ఆపరేషన్ నిర్వహించారు.
దర్యాప్తులో ఓ ఫార్మ్ను స్థానిక మద్యం తయారీ, నిల్వ, విక్రయాలకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. అనంతరం భద్రతా సిబ్బంది ఫార్మ్పై దాడి చేయగా.. మద్యం తయారు చేస్తున్న సమయంలో ముగ్గురు నిందితులను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. మరో వ్యక్తి అక్కడికి స్థానిక మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చిన సమయంలో అరెస్ట్ చేశారు. అతను కొనుగోలు చేసిన మద్యాన్ని తిరిగి విక్రయించేందుకు తీసుకెళ్లాలని భావించినట్లు అధికారులు తెలిపారు.
236 బాటిళ్ల మద్యం స్వాధీనం
దాడిలో విక్రయానికి సిద్ధంగా ఉన్న 236 ప్లాస్టిక్ బాటిళ్ల స్థానిక మద్యం, పెద్ద సంఖ్యలో బ్యారెళ్లు, మద్యం తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు, కొంత నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులు ఫార్మ్ను ప్రజలకు కనిపించకుండా స్థానిక మద్యం తయారీ, నిల్వ, విక్రయాలకు ఉపయోగిస్తున్నట్లు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. నాలుగో నిందితుడు మద్యం కొనుగోలు చేసి తిరిగి విక్రయిస్తున్నట్లు అంగీకరించినట్లు పేర్కొన్నారు.
ముగ్గురిపై ఇప్పటికే కేసులు
దర్యాప్తులో అరెస్ట్ అయిన వారిలో ముగ్గురు ఇప్పటికే అరెస్ట్ వారెంట్లు ఉన్న వ్యక్తులుగా తేలింది. వీరిలో కొందరిపై మోసం, వంచనకు సంబంధించిన కేసులు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నిందితులపై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగిస్తున్న ఆ ఫార్మ్ను తొలగించేందుకు కువైట్ మున్సిపాలిటీతో సమన్వయం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31.. ఎఫ్అండ్బీ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు
- బహ్రెయిన్లో వాడీ అల్-బుహైర్ మూసివేయలేదు..!!
- కువైట్లో నలుగురు భారతీయులు అరెస్ట్..!!
- ఒమన్లో డ్రగ్స్ అక్రమ రవాణాకు మరణశిక్ష, భారీ జరిమానాలు..!!
- ఇద్దరు బంగ్లాదేశీయులను రక్షించిన సౌదీ రెస్క్యూ టీమ్..!!
- 56% నెట్వర్క్ను పునరుద్ధరించిన ఎమిరేట్స్..!!
- 4 మిలియన్ల ప్రయాణికులకు సిద్ధమైన ఖతార్..!!
- ఇరాన్ యుద్ధం ముగింపు పై ట్రంప్ కీలక ప్రకటన
- యూఏఈలో పెట్టుబడుల కోసం ఒడిశా సీఎం మాఝీ దూకుడు.. రూ.2.1 లక్షల కోట్ల ఒప్పందం
- వినియోగదారుని పై బ్యాంకు చార్జీల భారం!







