విద్యార్థుల రీయింబర్స్మెంట్ పై సీఎం రేవంత్ కీలక ప్రకటన
- September 12, 2026
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ వేదికగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత కీలక ప్రకటన చేశారు. ఈ సంక్షేమ పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎత్తివేసే ప్రసక్తి లేదని సీఎం సభ ముఖంగా స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా, ఇకపై ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్మును నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోనే (DBT) జమ చేయనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి మరియు నిజమైన విద్యార్థులకే ప్రయోజనం చేకూరేలా ఫేస్ రికగ్నిషన్ (ముఖ గురింపు) విధానం ద్వారా 75 శాతం హాజరును తప్పనిసరి చేస్తూ కఠిన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
రూ.5,430 కోట్ల బకాయిల విడుదల: విద్యార్థులకు ప్రజా ప్రభుత్వ ఊరట
గత కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యా రంగానికి భారీగా ఫీజు బకాయిలు పేరుకుపోయాయని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో పెండింగ్లో పెట్టిన రూ. 5,430 కోట్ల భారీ బకాయిలను తమ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే విడుదల చేసి విద్యార్థులకు, కళాశాల యాజమాన్యాలకు ఊరట కలిగించామని సభకు గుర్తుచేశారు. నిధుల కొరత సాకుతో ఏ ఒక్క పేద విద్యార్థి ఉన్నత విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతోనే తమ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో ఈ-స్కూటర్లపై కొత్త నిబంధనలు..!!
- బిగ్ టికెట్లో భారతీయుడిని వరించిన అదృష్టం..!!
- సౌదీ అరేబియాలో కీలక చమురు పైప్లైన్ మూసివేత..!!
- కువైట్ విదేశాంగ మంత్రితో ఖతార్ ప్రధాని ఫోన్లో కీలక చర్చలు..!!
- రాస్ అల్ ఖైమాలో బీచ్ బార్బెక్యూపై నిషేధం..!!
- కువైట్ తీరాలకు తరలివస్తున్న ఫ్లెమింగోలు..!!
- విద్యార్థుల రీయింబర్స్మెంట్ పై సీఎం రేవంత్ కీలక ప్రకటన
- ఒమన్లో దారుణం.. తల్లిపై కత్తితో దాడి..!!
- హైదరాబాద్ కెప్టెన్ గా సిరాజ్
- ఆయు AIకి గూగుల్ ఫర్ స్టార్టప్స్ ఇండియా ప్రశంసలు.. గో-టు-మార్కెట్ మద్దతు







