ఇంధనరంగంలో జీరో-సబ్సిడీ శకంలోకి అడుగుపెట్టిన యు.ఏ.ఈ.

- July 29, 2015 , by Maagulf
ఇంధనరంగంలో జీరో-సబ్సిడీ శకంలోకి అడుగుపెట్టిన యు.ఏ.ఈ.

యు.ఏ.ఈ.  ఇంధన మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డా. మాతార్ అల్ న్యాదీ అధ్యక్షతన సమావేశమైన హైపవర్ కమిటీ, ఆగస్టు 1 నుండి అమలులోకి రాబోయే ఇంధన రేట్లను ప్రకటించడం ద్వారా సున్నా-సబ్సిడీ  శకంలోకి అడుగుపెట్టింది. అన్ లెడ్ గెసోలిన్ 98 ఆక్టెన్ ధర 22.95 శాతం పెరిగి 2.25 దీనర్,   అన్ లెడ్ గెసోలిన్ 95 ఆక్టెన్ ధర 24.41 శాతం పెరిగి 2.14 దీనర్ అయింది. ఇక ఏ-ప్లస్ 91 గెసోలిన్ పెరుగుదల 28.57 శాతం, ధర 2.07 దీనర్ అవ్వగా, డీసిల్ ధర మాత్రం 12.76 శాతం తగ్గి 2.05 డినార్ అయింది. ఈ శాందర్భంగా అల్ న్యాదీ మాట్లాడుతూ, గెసోలిన్ ధర పెరుగుదల ప్రభావం సగటున 18 నుండి 25 దీనర్లవరకు మాత్రమే పడిందని, ఆది వినియోగదారులపై పెద్దభారం కాబోదని అన్నారు. పైగా, ఇది సక్రమ ఇంధన వాడకానికి, ప్రజలు ఎక్కువ ఇంధన సమర్ధత గల కార్లను ఎంచుకోవడానికీ దోహాదమౌతుందనీ; ఇంకా డీజిల్ ధర తగ్గడం వలన దేశమంతా ప్రజలు ప్రజలు, పరిశ్రమలు, నౌకారంగం వంటివి లాభపడ్డాయని విశ్లేషించారు.


--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com