ఇంధనరంగంలో జీరో-సబ్సిడీ శకంలోకి అడుగుపెట్టిన యు.ఏ.ఈ.
- July 29, 2015
యు.ఏ.ఈ. ఇంధన మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డా. మాతార్ అల్ న్యాదీ అధ్యక్షతన సమావేశమైన హైపవర్ కమిటీ, ఆగస్టు 1 నుండి అమలులోకి రాబోయే ఇంధన రేట్లను ప్రకటించడం ద్వారా సున్నా-సబ్సిడీ శకంలోకి అడుగుపెట్టింది. అన్ లెడ్ గెసోలిన్ 98 ఆక్టెన్ ధర 22.95 శాతం పెరిగి 2.25 దీనర్, అన్ లెడ్ గెసోలిన్ 95 ఆక్టెన్ ధర 24.41 శాతం పెరిగి 2.14 దీనర్ అయింది. ఇక ఏ-ప్లస్ 91 గెసోలిన్ పెరుగుదల 28.57 శాతం, ధర 2.07 దీనర్ అవ్వగా, డీసిల్ ధర మాత్రం 12.76 శాతం తగ్గి 2.05 డినార్ అయింది. ఈ శాందర్భంగా అల్ న్యాదీ మాట్లాడుతూ, గెసోలిన్ ధర పెరుగుదల ప్రభావం సగటున 18 నుండి 25 దీనర్లవరకు మాత్రమే పడిందని, ఆది వినియోగదారులపై పెద్దభారం కాబోదని అన్నారు. పైగా, ఇది సక్రమ ఇంధన వాడకానికి, ప్రజలు ఎక్కువ ఇంధన సమర్ధత గల కార్లను ఎంచుకోవడానికీ దోహాదమౌతుందనీ; ఇంకా డీజిల్ ధర తగ్గడం వలన దేశమంతా ప్రజలు ప్రజలు, పరిశ్రమలు, నౌకారంగం వంటివి లాభపడ్డాయని విశ్లేషించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









