ఇంధనరంగంలో జీరో-సబ్సిడీ శకంలోకి అడుగుపెట్టిన యు.ఏ.ఈ.
- July 29, 2015
యు.ఏ.ఈ. ఇంధన మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డా. మాతార్ అల్ న్యాదీ అధ్యక్షతన సమావేశమైన హైపవర్ కమిటీ, ఆగస్టు 1 నుండి అమలులోకి రాబోయే ఇంధన రేట్లను ప్రకటించడం ద్వారా సున్నా-సబ్సిడీ శకంలోకి అడుగుపెట్టింది. అన్ లెడ్ గెసోలిన్ 98 ఆక్టెన్ ధర 22.95 శాతం పెరిగి 2.25 దీనర్, అన్ లెడ్ గెసోలిన్ 95 ఆక్టెన్ ధర 24.41 శాతం పెరిగి 2.14 దీనర్ అయింది. ఇక ఏ-ప్లస్ 91 గెసోలిన్ పెరుగుదల 28.57 శాతం, ధర 2.07 దీనర్ అవ్వగా, డీసిల్ ధర మాత్రం 12.76 శాతం తగ్గి 2.05 డినార్ అయింది. ఈ శాందర్భంగా అల్ న్యాదీ మాట్లాడుతూ, గెసోలిన్ ధర పెరుగుదల ప్రభావం సగటున 18 నుండి 25 దీనర్లవరకు మాత్రమే పడిందని, ఆది వినియోగదారులపై పెద్దభారం కాబోదని అన్నారు. పైగా, ఇది సక్రమ ఇంధన వాడకానికి, ప్రజలు ఎక్కువ ఇంధన సమర్ధత గల కార్లను ఎంచుకోవడానికీ దోహాదమౌతుందనీ; ఇంకా డీజిల్ ధర తగ్గడం వలన దేశమంతా ప్రజలు ప్రజలు, పరిశ్రమలు, నౌకారంగం వంటివి లాభపడ్డాయని విశ్లేషించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







