ఇంధనరంగంలో జీరో-సబ్సిడీ శకంలోకి అడుగుపెట్టిన యు.ఏ.ఈ.
- July 29, 2015
యు.ఏ.ఈ. ఇంధన మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డా. మాతార్ అల్ న్యాదీ అధ్యక్షతన సమావేశమైన హైపవర్ కమిటీ, ఆగస్టు 1 నుండి అమలులోకి రాబోయే ఇంధన రేట్లను ప్రకటించడం ద్వారా సున్నా-సబ్సిడీ శకంలోకి అడుగుపెట్టింది. అన్ లెడ్ గెసోలిన్ 98 ఆక్టెన్ ధర 22.95 శాతం పెరిగి 2.25 దీనర్, అన్ లెడ్ గెసోలిన్ 95 ఆక్టెన్ ధర 24.41 శాతం పెరిగి 2.14 దీనర్ అయింది. ఇక ఏ-ప్లస్ 91 గెసోలిన్ పెరుగుదల 28.57 శాతం, ధర 2.07 దీనర్ అవ్వగా, డీసిల్ ధర మాత్రం 12.76 శాతం తగ్గి 2.05 డినార్ అయింది. ఈ శాందర్భంగా అల్ న్యాదీ మాట్లాడుతూ, గెసోలిన్ ధర పెరుగుదల ప్రభావం సగటున 18 నుండి 25 దీనర్లవరకు మాత్రమే పడిందని, ఆది వినియోగదారులపై పెద్దభారం కాబోదని అన్నారు. పైగా, ఇది సక్రమ ఇంధన వాడకానికి, ప్రజలు ఎక్కువ ఇంధన సమర్ధత గల కార్లను ఎంచుకోవడానికీ దోహాదమౌతుందనీ; ఇంకా డీజిల్ ధర తగ్గడం వలన దేశమంతా ప్రజలు ప్రజలు, పరిశ్రమలు, నౌకారంగం వంటివి లాభపడ్డాయని విశ్లేషించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!







