అంగోలాకు చేరుకున్న ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్..!!
- September 18, 2026
లువాండా: ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ రెండు రోజుల అధికారిక పర్యటన కోసం స్నేహపూర్వక దేశమైన అంగోలాకు చేరుకున్నారు. అంగోలా అధ్యక్షుడు జోవో మాన్యుయెల్ లోరెన్సో ఆహ్వానం మేరకు ఆయన ఈ పర్యటన చేపట్టారు. లువాండా రాజధానిలోని క్వాట్రో డి ఫెవెరెరో అంతర్జాతీయ విమానాశ్రయానికి సుల్తాన్ హైతమ్ చేరుకోగా.. అంగోలా విదేశాంగ మంత్రి, గౌరవ స్వాగత బృందం అధిపతి టెటే ఆంటోనియోతో పాటు పలువురు అధికారులు ఆయనకు స్వాగతం పలికారు.
అంగోలా అధ్యక్షుడితో కీలక భేటీ
సుల్తాన్ హైతమ్కు శుక్రవారం లువాండాలోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో అధికారిక స్వాగత కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం అంగోలా అధ్యక్షుడు జోవో మాన్యుయెల్ లోరెన్సోతో సుల్తాన్ హైతమ్ సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారానికి సంబంధించిన అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. సుల్తాన్ వెంట ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా పర్యటనలో పాల్గొంటుంది. ఈ పర్యటనతో ఒమన్–అంగోలా ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊతం లభిస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో 172 బాటిళ్ల లిక్కర్ సీజ్.. ప్రవాసుడు అరెస్ట్..!!
- అంగోలాకు చేరుకున్న ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్..!!
- సౌదీలో ఎక్స్పాట్ డాక్టర్పై విచారణ..!!
- యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- ఖతార్లో మళ్లీ UFC ఫైట్ నైట్..!!
- ఒమన్లో వాహనదారులకు అలర్ట్.. నవంబర్ 18 స్ట్రీట్లో ట్రాఫిక్ మళ్లింపు..!!
- అబుదాబిలో హాలిడే హోమ్ నిబంధనలు మార్పు..!!
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం







