టెంట్స్ తగలబెట్టిన కేసులో బహ్రెయినీకి జైలు
- August 21, 2016
గత పార్లమెంటరీ ఎన్నికల్లో ఓ అభ్యర్థికి చెందిన రెండు టెంట్లను తగలబెట్టిన కేసులో బహ్రెయిన్కి చెందిన వ్యక్తికి జైలు శిక్ష పడింది. ఈ కేసులో మరో వ్యక్తికి కూడా జైలు శిక్ష విధించింది హై క్రిమినల్ అపీల్స్ కోర్ట్. ఇద్దరికీ చెరో ఐదేళ్ళ జైలు శిక్షను ఖరారు చేసింది న్యాయస్థానం. టెంట్లపై పెట్రోల్ని పోసి, ఫైర్బంబ్స్ని విసిరి తగలబెట్టారు నిందితులు. 2014, అక్టోబర్ 25న జరిగింది ఈ ఘటన. ఎన్నికల పోటీ నుంచి సదరు అభ్యర్థి తప్పుకునేలా చేయడానికే ఈ దారుణానికి ఒడిగట్టారు నిందితులు. అయితే ఆ అభ్యర్థి అబ్దుల్లా తాహిర్ ఎన్నికల్లో పోటీ చేశారు, అయితే ఓడిపోయారు. అగ్ని ప్రమాదం కారణంగా జరిగిన నష్టాన్ని 4,500 బహ్రెయినీ దినార్లుగా అంచనా వేశారు. ఈ ప్రమాదంలో పవర్ జనరేటర్, పెద్ద రగ్గు వంటివి దహనమయ్యాయి.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









