టెంట్స్ తగలబెట్టిన కేసులో బహ్రెయినీకి జైలు
- August 21, 2016
గత పార్లమెంటరీ ఎన్నికల్లో ఓ అభ్యర్థికి చెందిన రెండు టెంట్లను తగలబెట్టిన కేసులో బహ్రెయిన్కి చెందిన వ్యక్తికి జైలు శిక్ష పడింది. ఈ కేసులో మరో వ్యక్తికి కూడా జైలు శిక్ష విధించింది హై క్రిమినల్ అపీల్స్ కోర్ట్. ఇద్దరికీ చెరో ఐదేళ్ళ జైలు శిక్షను ఖరారు చేసింది న్యాయస్థానం. టెంట్లపై పెట్రోల్ని పోసి, ఫైర్బంబ్స్ని విసిరి తగలబెట్టారు నిందితులు. 2014, అక్టోబర్ 25న జరిగింది ఈ ఘటన. ఎన్నికల పోటీ నుంచి సదరు అభ్యర్థి తప్పుకునేలా చేయడానికే ఈ దారుణానికి ఒడిగట్టారు నిందితులు. అయితే ఆ అభ్యర్థి అబ్దుల్లా తాహిర్ ఎన్నికల్లో పోటీ చేశారు, అయితే ఓడిపోయారు. అగ్ని ప్రమాదం కారణంగా జరిగిన నష్టాన్ని 4,500 బహ్రెయినీ దినార్లుగా అంచనా వేశారు. ఈ ప్రమాదంలో పవర్ జనరేటర్, పెద్ద రగ్గు వంటివి దహనమయ్యాయి.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







