కడుపులో మాదక ద్రవ్యాలు
- August 26, 2016
పాకిస్తాన్కి చెందిన ఓ వ్యక్తిని డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు, షార్జా షరియా కోర్టులో హాజరుపరిచారు. విశ్వసనీయ వర్గాల సమాచారంతో రంగంలోకి దిగిన యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అధికారులు, నిందితుడు ఉన్న హోటల్ రూమ్లో సోదాలు నిర్వహించారు. అయితే అక్కడ వారికి ఎలాంటి మాదక ద్రవ్యాలూ దొరకలేదు. తదనంతరం అతన్ని విచారించగా, కడుపులో క్యాప్సూల్స్ ఉన్నాయనీ, వాటి ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. 37 క్యాప్సూల్స్లో డ్రగ్స్ని స్మగ్లింగ్ చేశానని పోలీసులకు తెలిపాడు నిందితుడు. దాంతో పోలీసులు, నిందితుడ్ని ఆసుపత్రికి తరలించి, డ్రగ్స్ క్యాప్సూల్స్ని వెలికి తీశారు. షార్జా షరియా న్యాయస్థానంలో కేసు విచారణ సెప్టెంబర్ 21వ తేదీకి వాయిదా పడింది. మరో కేసులో షార్జా న్యాయస్థానం ఐదుగురు ఆసియాకి చెందిన వ్యక్తుల్ని డ్రగ్స్ ట్రాఫికింగ్ కేసులో నిందితులుగా తేల్చింది
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







