ఖరీఫ్ సీజన్లో 604,990 మంది సలాలా సందర్శకులు
- August 30, 2016
సలాలాను ఈ ఖరీఫ్ సీజన్లో సందర్శించినవారి సంఖ్య 604,000కి చేరింది. గత ఏడాది ఇదే సమయానికి నమోదైన రిజిస్ట్రేషన్లతో పోల్చితే ఇది చాలా ఎక్కువ. ఆగస్ట్ 20 వరకు సందర్శించిన 604,990 మందిని లెక్కేస్తే, 21.7 శాతం పెరుగుదల నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఈ వివరాల్నివ ఎల్లడించింది. ఇందులో ఒమనీయుల సంఖ్య 447,713. ఇది 74 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే శాతం 21.6గా ఉంది. యూఏఈ నుంచి వచ్చిన పర్యాటకుల సంఖ్య 57,079గా ఉంది. సౌదీ విజిటర్స్ సంఖ్య 25,139గా ఉంది. బహ్రెయిన్ నుంచి 5,981, కువైట్ మరియు కతార్ నుంచి వచ్చినవారు 5,957, 6810 మంది ఉన్నారు. యూరోపియన్ విజిటర్స్ 2,136, అమెరికన్ దేశాల నుంచి వచ్చినవారి సంఖ్య 810, ఆఫ్రికా మరియు ఒసీనియా 267, 180 మంది ఉన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







