గుజరాత్‌లో ప్రాజెక్టు ప్రారంభించిన నరేంద్ర మోదీ

- August 30, 2016 , by Maagulf
గుజరాత్‌లో ప్రాజెక్టు ప్రారంభించిన నరేంద్ర మోదీ

అహ్మదాబాద్‌: ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నరేంద్ర మోదీ తొలిసారి సొంత రాష్ట్రం గుజరాత్‌లో బహిరంగసభలో పాల్గొన్నారు. సభకు మోదీ రాజకీయంగా కీలకమైన, పటేళ్ల ప్రభావం అధికంగా ఉన్న సౌరాష్ట్ర ప్రాంతాన్ని ఎంచుకున్నారు. సౌని పథకం కింద ఆజి-3 డ్యామ్‌ ప్రారంభించిన అనంతరం మోదీ బహిరంగ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పంట బీమా సహా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని చెప్పారు. భవిష్యత్తు తరాల కోసం నీటిని జాగ్రత్తగా కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. నీరు సక్రమంగా అందించగలిగితే రైతులు అద్భుతాలు సృష్టిస్తారన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com