ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియాకు ఎదురుదెబ్బ
- August 31, 2016
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా, సిరియా సంయుక్త బలగాల దాడిలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూప్ అధికార ప్రతినిధి అబు అహమ్మద్ అల్ అద్నానీ అంతం అయ్యాడు.
సిరియాలోని అలెప్పో ప్రావిన్స్ ప్రాంతంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద నాయకులను లక్షంగా చేసుకుని వైమానిక దాడులు జరిపామని అమెరికా తెలిపింది. అద్నానీ మరణించాడని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ దృవీకరించింది.
కాల్పులు పర్యవేక్షించడానికి వెళ్లిన అద్నానీని అమెరికా, సిరియా సంయుక్త బలగాలు చాకచక్యంగా అంతం చేశాయి.
ఐఎస్ఐఎస్ కి చెందిన కీలక సీనియర్ నేతలను లక్షంగా చేసుకుని దాడులు చేస్తామని అమెరికా ప్రకటించిన మరుసటి రోజే అద్నానీ అంతం అయ్యాడు.
సిరియాలోని అల్ బాబ్ ప్రాంతంలో ఐఎస్ఐఎస్ నాయకులను లక్షంగా చేసుకుని వైమానిక దాడులు చేస్తున్నారు. అద్నానీని అంతం చేసి తాము విజయం సాధించామని అమెరికా, సిరియా తెలిపాయి.
అయితే అద్నానీ అంతం అయినంత మాత్రాన తమకు నష్టం లేదని, అద్నానీ లాంటి వారు పదుల సంఖ్యలో పోరాటం చేయ్యడానికి ముందుకు వస్తారని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ తెలిపింది.
అలెప్పో మీద పట్టుకోసం అద్నానీ ఆధ్వర్యంలోనే ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కొంత కాలం నుంచి దాడులు చేస్తున్నారు. ఈ విషయం పసిగట్టిన సంయుక్త బలగాలు అద్నానీని టార్గెట్ చేసుకుని అంతం చేశాయి.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









