రోడ్డు మార్గంలో హజ్ వచ్చేవారికి నేటితో ముగియనున్న గడువు
- September 02, 2016
రోడ్డు మార్గంలో వచ్చే హజ్ యాత్రీకులకు డెడ్లైన్ నేటితో (శుక్రవారం సెప్టెంబర్ 2) ముగియనుందని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ వెల్లడించింది. గడువు ముగియనున్న దరిమిలా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా గడవు లోపు యాత్రీకులు హజ్ కోసం తరలి రావాలని పిలుపునిచ్చారు. ఇంకో వైపున జిసిసి దేశాల నుంచి హజ్ యాత్రకు వచ్చేవారు, తమ వెంట ఆయా దేశాలు ఇచ్చే పర్మిట్స్ని తమ వెంట తప్పనిసరిగా తీసుకురావాలనీ, లేని పక్షంలో వారిని తిరిగి పంపించేస్తామని జనరల్ డైరెక్టరేట్ ఓ ప్రకటనలో పేర్కొంది. గ్రాండ్ మాస్క్ వద్ద మతాఫ్ సెక్షన్ నుంచి వీల్చైర్స్ వినియోగంపై బ్యాన్ విధించామనీ, ఈ సూచనను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు కోరారు. యాత్రీకుల భద్రత నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నట్లు వారు వెల్లడించారు. మక్కా టన్నెల్స్ అన్నీ పలు టీమ్లతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, టాక్సిక్ గ్యాస్ విషయమై పరీక్షలు నిరంతరం జరుగుతాయనీ, అనుకోని సంఘటనలు ఎదురైతే వెంటనే తగిన చర్యలు తీసుకోబడ్తాయని సివిల్ డిఫెన్స్ చీఫ్ బ్రిగేడియర్ అహ్మద్ అల్ దులైవి చెప్పారు. వీల్ చైర్స్ డిపార్ట్మెంట్, 300 బ్యాటరీ ఆపరేటెడ్ వీల్చైర్స్ని అందుబాటులో ఉంచామనీ, ఇరవై నాలుగ్గంటలూ అవి అందుబాటులో ఉంటాయని అధికారులు వివరించారు. హజ్ సీజన్లో ఉష్ణోగ్రతలో 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్







