కేరళలో మద్యం, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారకర్తగా సచిన్
- September 03, 2016
మద్యం, మాదక ద్రవ్యాల కట్టడికి కేరళ ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్రంలో వాటిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా కేరళ ప్రభుత్వం తాజాగా సరికొత్త నిర్ణయం తీసుకుంది. మద్యం, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారకర్తగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయాన్ని కేరళ రాష్ట్ర ఎక్సైజ్, లేబర్ మినిస్టర్ రామకృష్ణన్ వెల్లడించారు. మీడియా సమేవేశంలో ఆయన మాట్లాడుతూ.. మద్యం, డ్రగ్స్లకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందని వెల్లడించారు. క్రమంగా మద్యానికి బానిసలుగా మారిన వారి సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
మద్యం మత్తు నుంచి బయటపడే పలు సెంటర్లను ప్రతి జిల్లాస్థాయిలో తెరవనున్నట్టు కూడా మంత్రి రామకృష్ణన్ తెలిపారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







