ప్రాణ స్నేహితుల కలయిక
- September 03, 2016
ఎప్పుడూ బిజీగా ఉండే చిరకాల స్నేహితులు ఒకింత తీరిక సుకుని...ఒకరినొకరు కలుసుకుంటే అది వారి జీవితాల్లో తీపిగుర్తులా మిగిలిపోతుంది. 'స్నేహబంధమూ ఎంత మధురమూ' అంటూ ఆప్యాయాతానురాగాలు కురిపించుకుంటాయి. మొదట ఆనందంతో మాటలు కరువైనా...ఆ తరువాత గత స్మృతులను నెమరువేసుకుంటూ తమదైన ప్రపంచంలో సర్వం మరిచిపోతారు. అలాంటి అనుభూతులనే 'పెదరాయుడు' మోహన్బాబు, తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ పంచుకున్నారు. శనివారంనాడు చెన్నైలో తన మిత్రుడు రజనీకాంత్ను మోహన్బాబు కలుసుకుని విలువైన సమయాన్ని గడిపారు. ఆ అనుభూతులను ట్విటర్ ద్వారా మోహన్బాబు పంచుకున్నారు. 'చాలాకాలం తర్వాత నా మిత్రుడు రజనీకాంత్ను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.
ఆయన కింగ్లా ఉన్నారు. ఈ కలియుగంలో ఆయన దుర్యోధనుడయితే నేను కర్ణుడిని' అని మోహన్బాబు ఆ ట్వీట్లో తమ అనుబంధాన్ని చాటుకున్నారు. తామిద్దరూ కలుసుకున్న ఫోటోతో పాటు రజనీకాంత్ సతీమణి లత తన చేతికి రాఖీ కడుతున్న ఫోటోను ఆయన పోస్ట్ చేశారు. 'చాలాకాలం తర్వాత నా సోదరి లతను కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది.
రజనీకాంత్ విజయం వెనుక ఆయన సతీమణి లత ఉందని నేను బలంగా నమ్ముతున్నాను' అంటూ రజనీదంపతులపై ఆప్యాయతానురాగాలు కురిపించారు కలెక్షన్ కింగ్.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







