ప్రాణ స్నేహితుల కలయిక
- September 03, 2016
ఎప్పుడూ బిజీగా ఉండే చిరకాల స్నేహితులు ఒకింత తీరిక సుకుని...ఒకరినొకరు కలుసుకుంటే అది వారి జీవితాల్లో తీపిగుర్తులా మిగిలిపోతుంది. 'స్నేహబంధమూ ఎంత మధురమూ' అంటూ ఆప్యాయాతానురాగాలు కురిపించుకుంటాయి. మొదట ఆనందంతో మాటలు కరువైనా...ఆ తరువాత గత స్మృతులను నెమరువేసుకుంటూ తమదైన ప్రపంచంలో సర్వం మరిచిపోతారు. అలాంటి అనుభూతులనే 'పెదరాయుడు' మోహన్బాబు, తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ పంచుకున్నారు. శనివారంనాడు చెన్నైలో తన మిత్రుడు రజనీకాంత్ను మోహన్బాబు కలుసుకుని విలువైన సమయాన్ని గడిపారు. ఆ అనుభూతులను ట్విటర్ ద్వారా మోహన్బాబు పంచుకున్నారు. 'చాలాకాలం తర్వాత నా మిత్రుడు రజనీకాంత్ను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.
ఆయన కింగ్లా ఉన్నారు. ఈ కలియుగంలో ఆయన దుర్యోధనుడయితే నేను కర్ణుడిని' అని మోహన్బాబు ఆ ట్వీట్లో తమ అనుబంధాన్ని చాటుకున్నారు. తామిద్దరూ కలుసుకున్న ఫోటోతో పాటు రజనీకాంత్ సతీమణి లత తన చేతికి రాఖీ కడుతున్న ఫోటోను ఆయన పోస్ట్ చేశారు. 'చాలాకాలం తర్వాత నా సోదరి లతను కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది.
రజనీకాంత్ విజయం వెనుక ఆయన సతీమణి లత ఉందని నేను బలంగా నమ్ముతున్నాను' అంటూ రజనీదంపతులపై ఆప్యాయతానురాగాలు కురిపించారు కలెక్షన్ కింగ్.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







