సినీ పరిశ్రమ అభివృద్ధి మండలి డిప్యూటీ చైర్ పర్సన్గా జయప్రద
- September 03, 2016
ఉత్తర్ప్రదేశ్ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి మండలి డిప్యూటీ చైర్ పర్సన్గా నియమితులైన సినీనటి జయప్రద తొలిసారిగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఆమెకు అభిమానులు ఎయిర్పోర్టులో ఘనస్వాగతం పలికారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తనను ఉత్తర్ప్రదేశ్ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి మండలి డిప్యూటీ చైర్పర్సన్ గానియమించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ములాయంసింగ్ యాదవ్, ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్కు కృతజ్ఙతలు తెలిపారు. సాహితీవేత్త నీరజ్ను చైర్మన్గా నియమించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి తాను పూర్తిస్థాయిలో తోడ్పడతానని చెప్పారు.
బొంబాయి హాలీహుడ్ మాదిరిగా యూపీ సినీ పరిశ్రమను తీర్చిదిద్దుతానన్నారు. తెలుగు, తమిళ సినీ అభిమానులు తనను ఎంతో కాలంగా ఆదరిస్తున్నారని, టాలీవుడ్, కోలీవుడ్ అభివృద్ధికి శక్తివంచనలేకుండా కృషిచేస్తానని జయప్రద తెలిపారు. అనంతరం ఆమెను అభిమానులు పూలమాలలు శాలువాలతో సన్మానించారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







