ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వానికి ఆస్ట్రేలియా మద్దతు
- September 04, 2016
న్యూక్లియర్ సప్లైయర్స్ గ్రూప్లో భారత్ సభ్యత్వానికి ఆస్ట్రేలియా నుంచి మద్దతు లభించింది. చైనాలో జీ20 సదస్సుకు ముందు ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్బుల్ భారత ప్రధాని నరేంద్రమోదీని కలిసిన సందర్భంగా ఈ విషయాన్ని తెలిపారు. ఆస్ట్రేలియా గతంలోనే భారత్ సభ్యత్వానికి మద్దతు తెలిపింది. దీనిని మాల్కం మరోసారి పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు.
ఇరువురు నేతలు సమావేశంలో పలు అంశాలను చర్చించారు. ఇరు ప్రాంతాల్లో భద్రతాపరమైన సమస్యలు పరిష్కారానికి ప్రయత్నించారు. దీంతోపాటు ఇరు పక్షాలు పరస్పరం రక్షణ, భద్రతా పరమైన అంశాలపై సహకరించుకోవాలన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొవటానికి ప్రపంచంలోని అన్ని ప్రజాస్వామ్య శక్తులు ఏకం కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చినట్లు వికాస్ స్వరూప్ తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









