కలాం సన్నిహితుడితో రజిని భేటీ
- September 05, 2016
దక్షిణాది సూపర్స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా? రారా? అనే అంశం దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. తమిళనాడులో ఎన్నికల సమయం దగ్గరపడితే చాలు రజినీకాంత్ ఆ పార్టీలో చేరతారు?, ఈ పార్టీలో చేరతారు? లేదా సొంత పార్టీతో ఎన్నికల బరిలో నిలుస్తారంటూ ఊహాగానాలు చక్కర్లు కొడుతూ ఉండేవి.
కాగా, తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు గమనించినట్లయితే ఆ ఊహాగానాలకు తెరపడే సమయం దగ్గరపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్తో దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం సన్నిహితుడు పొన్రాజ్ భేటీ కావడమే ఇందుకు కారణమని మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
పొన్రాజ్.. అబ్దుల్ కలాం విజన్ ఇండియా పార్టీ (అబ్దుల్ కలాం వీఐపీ) వ్యవస్థాపకుడు కావడం గమనార్హం. రజనీకాంత్ సినిమా డైలాగులు ఆధారంగా ఆయన అభిమానులు రాజకీయ రంగ ప్రవేశంపై అంచనాలు వేస్తుంటారు. నరసింహలోని 'నా దారి రహదారి', భాషాలోని 'నేను ఒకసారి చెబితే వందసార్లు చెప్పినట్లు', బాబాలోని 'రావలసిన సమయానికి సరిగ్గా వస్తాను' అనే డైలాగులను ఇందుకు ఉదాహరణగా చెబుతుంటారు.
కాగా, నేటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని పొన్రాజ్ అభిప్రాయపడగా.. 'దేవుని చిత్తం అదే అయితే అలాగే జరుగుతుంది' అంటూ రజనీకాంత్ వ్యాఖ్యానించారని సమాచారం. రజనీకాంత్ వంటి వ్యక్తులు రాజకీయాల్లో తప్పకుండా ఉండాలని పొన్రాజ్ బలంగా కోరుకుంటున్నారని సమాచారం.
అయితే, గతంలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావడంతో ఆయన బిజెపిలో చేరతారని ఊహాగానాలు వచ్చాయి, అంతేగాక, రాష్ట్ర బిజెపి నేతలు కూడా రజినీతో చర్చలు జరిపారు. అయితే, వారి ప్రతిపాదన కూడా అలాగే ఉండిపోయింది.
ప్రస్తుతం రజనీకాంత్ రోబో-2 చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రజనీకాంత్ ఈ విషయంపై స్పష్టత ఇచ్చే వరకు ఆయన రాజకీయాల్లో వస్తారా? లేదా? అనే అంశం మళ్లీ ప్రశ్నార్థకంగానే మిగలనుంది. అయితే, రజనీకాంత్ అభిమానులతోపాటు పలువురు రాజకీయ నాయకులు కూడా ఆయన రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..









