బ్రిటన్ కొత్త ప్రధానిని కలిసిన మోడీ
- September 05, 2016
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ బ్రిటన్ నూతన ప్రధాని థెరిస్సా మేతో భేటీ అయ్యారు. బ్రెగ్జిట్ అనంతరం బ్రిటన్ కొత్త ప్రధానమంత్రితో మోదీ సమావేశమవడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగశాఖ మీడియా ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సమావేశంలో ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం మోదీ చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న జీ20 సదస్సుకు హాజరయ్యారు.
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగాక బ్రిటన్ ప్రధాని పదవి నుంచి డేవిడ్ కామెరూన్ తప్పుకున్నారు.
దీంతో జులై 13న థెరిసా నూతన ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. బ్రిటన్కు మార్గరెట్ తర్వాత రెండో మహిళా ప్రధానమంత్రిగా థెరిస్సా నియమితులైన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









