52 వేలమంది అక్రమ యాత్రికులకు మక్కా ప్రవేశంకి నిరాకరణ
- September 05, 2016
మనామా: దాదాపు 52 వేలమంది ప్రజలకు సరైన అనుమతులు కలిగిలేనందున ముస్లింల పవిత్ర నగరం మక్కా నుండి వెనుదిరిగి పంపించి వేశారు.
హజ్ ఆచారాలు ప్రారంభించడానికి కొన్ని రోజుల ముందు ఆ యాత్రికులను వెనక్కి తిరిగి పంపించివేశారు
హజ్ యాత్ర ఇస్లాం మతం యొక్క ఐదవ స్థంభంగా ఉంది. జీవితకాలంలో ఒక్కసారైనా ఈ పుణ్యక్షేత్రంని దర్శించుకోవాలని ముస్లింలు అభిలషిస్తారు. సుమారు 24 వేల కార్లని సైతం చెల్లుబాటు అనుమతులు లేని కారణంగా భద్రతా అధికారులు మక్కా లోనికి ప్రవేశించకుండా నిరోధించబడ్డారని బహిత భద్రతా కేంద్రం అధిపతి మొహమ్మద్ అల్ హారతి " మా గల్ఫ్ డాట్ కామ్ " కు తెలిపారు.
మక్కా యాత్రకు ప్రయాణించే ముందు వారి పత్రాలు సరైన క్రమంలో ఉండేలా చూసుకోవాలని ఆయన యాత్రికులను కోరారు. ఈ యాత్రికులకు చెందిన దేశాలలో ఏ విధంగా హాజ్ కు చేరుకోవాలనే విషయంపై భారీ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రతి సంవత్సరం వేలాదిమంది యాత్రికులని వెనక్కి పంపించవేయాల్సి వస్తుందని ఆయన అన్నారు. చాలామంది వేగంగా హాజ్ యాత్రకు పంపించేవారి కోసం చూస్తున్నారు కానీ, గుర్తింపు పొందిన హజ్ ఆపరేటర్ల ద్వారా సరైన అనుమతులని పొందేందుకు ప్రయత్నించడం లేదని అన్నారు. బహ్రయినీయులు మరియు ఇతర గల్ఫ్ దేశాల సమాఖ్య పౌరులు సౌదీ అరేబియా ప్రవేశ వీసాలు అవసరం లేదు.ఈ ఏడాది సెప్టెంబర్ 10 వ తేదీన ప్రారంభమై ఐదు రోజుల పాటు కొనసాగే హాజ్ కు మూడు మిలియన్ల మంది యాత్రికులు హాజరుకానున్నట్లు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







