ప్రిన్స్ మహేష్ బాబు దుబాయ్ నుంచి తిరిగొచ్చాడు..
- September 06, 2016
ప్రిన్స్ మహేష్ బాబు దుబాయ్ నుంచి తిరిగొచ్చాడు. అదేంటీ.. ఇన్నాళ్లు మహేష్ హైదరాబాద్ లో లేడా.. ? నిజంగానే ఇక్కడ లేరు. ప్రస్తుతం మహేష్ మురగదాస్ కలయికలో తెరకెక్కుతోన్న చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టనుంది. దర్శకుడు ఎస్ జె సూర్య విలన్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం.. చెన్నై షెడ్యూల్ రేపటి (సెప్టెంబర్ 7) నుంచి చెన్నైలో జరగనుంది.హైదరాబాద్ షెడ్యూల్ తర్వాత దొరికిన ఈ గ్యాప్ లో ఫ్యామిలీతో కలిసి దుబాయ్ చెక్కేశాడు ప్రిన్స్. తనయుడు గౌతమ్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ ని కూడా అక్కడే కానిచ్చిన మహేష్.. నిన్న సాయంత్రం తిరిగి హైద్రాబాద్ చేరుకున్నారు.ఇక, రేపటి నుంచి మళ్లీ రంగంలోకి దిగనున్నాడు మహేష్. బుధవారం నుంచి ప్రారంభం కానున్న చెన్నై షెడ్యూల్ లో పాల్గొననున్నారు. ఈ షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా వేసిన సెట్లో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం హరీష్ జై రాజ్.ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు నిర్మాతలు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









