ప్రిన్స్ మహేష్ బాబు దుబాయ్ నుంచి తిరిగొచ్చాడు..
- September 06, 2016
ప్రిన్స్ మహేష్ బాబు దుబాయ్ నుంచి తిరిగొచ్చాడు. అదేంటీ.. ఇన్నాళ్లు మహేష్ హైదరాబాద్ లో లేడా.. ? నిజంగానే ఇక్కడ లేరు. ప్రస్తుతం మహేష్ మురగదాస్ కలయికలో తెరకెక్కుతోన్న చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టనుంది. దర్శకుడు ఎస్ జె సూర్య విలన్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం.. చెన్నై షెడ్యూల్ రేపటి (సెప్టెంబర్ 7) నుంచి చెన్నైలో జరగనుంది.హైదరాబాద్ షెడ్యూల్ తర్వాత దొరికిన ఈ గ్యాప్ లో ఫ్యామిలీతో కలిసి దుబాయ్ చెక్కేశాడు ప్రిన్స్. తనయుడు గౌతమ్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ ని కూడా అక్కడే కానిచ్చిన మహేష్.. నిన్న సాయంత్రం తిరిగి హైద్రాబాద్ చేరుకున్నారు.ఇక, రేపటి నుంచి మళ్లీ రంగంలోకి దిగనున్నాడు మహేష్. బుధవారం నుంచి ప్రారంభం కానున్న చెన్నై షెడ్యూల్ లో పాల్గొననున్నారు. ఈ షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా వేసిన సెట్లో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం హరీష్ జై రాజ్.ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు నిర్మాతలు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







