రామోజీ ఫిల్మ్సిటీలో 'ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్'
- September 06, 2016
ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రం రామోజీ ఫిల్మ్సిటీలో ఈనెల 24 నుంచి ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్ జరగనుంది. కార్నివాల్ వివరాలను సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. కార్నివాల్లో 20వేల మంది అతిథులు పాల్గొంటారని, 200 చిత్రాలు, వెయ్యి లఘుచిత్రాలు ప్రదర్శిస్తారని తెలిపారు. రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. 50 నుంచి 100 ఎకరాల్లో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కార్నివాల్లో ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రముఖులు పాల్గొంటారని ఏరిస్ కంపెనీ సీఈవో సోహన్రాయ్ తెలిపారు.
అతిపెద్ద భారత చలనచిత్ర పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకే ఈ కార్నివాల్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









