మెడికల్ వీసాల్లో 222 శాతం పెరుగుదల
- September 07, 2016
మస్కట్: ఒమన్లోని ఇండియన్ ఎంబసీ 222 శాతం వృద్ధితో రికార్డు స్థాయిలో మెడికల్ వీసాల్ని ఆగస్ట్ చివరి నాటికి మంజూరు చేసింది. గత ఏడాదితో పోల్చితే ఈ శాతం చాలా ఎక్కువని ఎంబసీ వర్గాలు వెల్లడించాయి. మొత్తం 14,585 మెడికల్ వీసాల్ని ఈ ఏడాది ఆగస్ట్ చివరి నాటికి మంజూరయ్యాయి. గత ఏడాది వీటి సంఖ్య 4,530 మాత్రమే. 14,585 వీసాల్ని పొందినవారిలో 95 శాతం ఒమనీయులే. భారతదేశానికి మెడికల్ ట్రీట్మెంట్ కోసం వీరంతా వెళ్ళారు. మిగతావారిలో యెమనీలు, బంగ్లాదేశీ మరియు ఇండోనేసియన్లు ఉన్నారు. భారతదేశంలో లభిస్తున్న వైద్య సేవలు అత్యంత నాణ్యంగా, అతి తక్కువ ఖర్చుతో ఉంటుండడంతోనే భారతదేశానికి వెళ్ళి వైద్యం చేయించుకోవడానికి ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నట్లు సుల్తానేట్లో భారత రాయబారిగా పనిచేస్తున్న ఇంద్రా మణి పాండే తెలిపారు. ఆంకాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, న్యూరాలజీ వంటి స్పెషాలిటీ వైద్య సేవలు ఇండియాలో అత్యద్భుతంగా అందుబాటులో ఉన్నాయని ఒమన్లోని లైఫ్ లైన్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ రోహిల్ రాఘవన్ చెప్పారు. గతంలో యూరోప్కి వెళ్ళేందుకు ఆసక్తి చూపేవారంతా ఇప్పుడు వైద్యం కోసం భారతదేశానికి వెళుతున్నట్లు వివరించారాయన.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







