పాకిస్థాన్పై ప్రధాని మోదీ పరోక్షంగా వ్యాఖ్యలు ..
- September 08, 2016
ఒక దేశం నుంచి మన దేశాలకు వ్యాపిస్తున్న ఉగ్రవాదమే మనందరి ప్రధాన సమస్య అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. లావోస్ రాజధాని వియంటియాన్లో జరుగుతున్న 14వ ఆసియాన్- ఇండియా సదస్సులో గురువారం ప్రధాని మోదీ ప్రసగించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్పై ప్రధాని మోదీ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.'ఉగ్రవాదం, ఉగ్ర భావజాలం, హింస ఇతర దేశాలకు వ్యాపించేలా చేస్తున్నారు' అని పాక్నుద్దేశించి మోదీ అన్నారు. దీనిపై కలిసికట్టుగా సమష్టి కృషి చేయాలని ఆసియాన్ దేశాధినేతలకు పిలుపునిచ్చారు. .ఉగ్రవాదం, సైబర్ సెక్యూరిటీపై పోరాడేందుకు భారత్ చర్యలు తీసుకోవాలని భావిస్తోందని, దీనికి ఆసియాన్ దేశాలు కూడా మద్దతివ్వాలని కోరారు.ప్రధాని మోదీ పాక్పై వ్యాఖ్యలు చేయడం ఇది రెండోసారి. ఇటీవల చైనాలో జరిగిన జీ20 సదస్సులోనూ మోదీ.. పాక్ వైఖరిపై పరోక్షంగా స్పందించారు. దక్షిణాసియాలోని ఓ దేశం ఉగ్రవాదాన్ని పెంపొదిస్తోందని మోదీ ఆ సమయంలో చెప్పారు.
తాజా వార్తలు
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!









