పాకిస్థాన్పై ప్రధాని మోదీ పరోక్షంగా వ్యాఖ్యలు ..
- September 08, 2016
ఒక దేశం నుంచి మన దేశాలకు వ్యాపిస్తున్న ఉగ్రవాదమే మనందరి ప్రధాన సమస్య అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. లావోస్ రాజధాని వియంటియాన్లో జరుగుతున్న 14వ ఆసియాన్- ఇండియా సదస్సులో గురువారం ప్రధాని మోదీ ప్రసగించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్పై ప్రధాని మోదీ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.'ఉగ్రవాదం, ఉగ్ర భావజాలం, హింస ఇతర దేశాలకు వ్యాపించేలా చేస్తున్నారు' అని పాక్నుద్దేశించి మోదీ అన్నారు. దీనిపై కలిసికట్టుగా సమష్టి కృషి చేయాలని ఆసియాన్ దేశాధినేతలకు పిలుపునిచ్చారు. .ఉగ్రవాదం, సైబర్ సెక్యూరిటీపై పోరాడేందుకు భారత్ చర్యలు తీసుకోవాలని భావిస్తోందని, దీనికి ఆసియాన్ దేశాలు కూడా మద్దతివ్వాలని కోరారు.ప్రధాని మోదీ పాక్పై వ్యాఖ్యలు చేయడం ఇది రెండోసారి. ఇటీవల చైనాలో జరిగిన జీ20 సదస్సులోనూ మోదీ.. పాక్ వైఖరిపై పరోక్షంగా స్పందించారు. దక్షిణాసియాలోని ఓ దేశం ఉగ్రవాదాన్ని పెంపొదిస్తోందని మోదీ ఆ సమయంలో చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!







