మిలిటెంట్లు పోలీసుల తుపాకులతో పరారీ
- September 08, 2016
కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన ఓ నాయకుడి ఇంటిపై మిలిటెంట్లు దాడి చేశారు. భద్రతా సిబ్బందిని కొట్టి.. వారి తుపాకులతో పరారయ్యారు. కుల్గాం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..నేషనల్ కాన్ఫరెన్స్ బ్లాక్ ప్రెసిడెంట్ అబ్దుల్ రషీద్ ఖాండే ఇంటి ఆవరణలోకి కొందరు మిలిటెంట్లు చొరబడ్డారు. రషీద్ ఇంటి వద్ద కాపలా కాస్తున్న భద్రతాసిబ్బందిపై దాడి చేసి, నాలుగు సర్వీసు తుపాకులను ఎత్తుకెళ్లారు. దీంతో రషీద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.కశ్మీర్ వ్యాప్తంగా భద్రతాసిబ్బందిని అప్రమత్తం చేసి, పరారైన మిలిటెంట్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







