'ఫిదా' చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి
- September 08, 2016
వరుణ్తేజ్ కథానాయకుడిగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫిదా' చిత్రం నిజామాబాద్ జిల్లా బాన్స్వాడలో షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. హీరో వరుణ్తేజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తొలి షెడ్యూల్ పూర్తయినట్లు అభిమానులకు తెలిపారు. బాన్స్వాడ షూటింగ్ చాలా సరదాగా జరిగిందని, ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నామని పేర్కొంటూ.. కథానాయిక సాయిపల్లవి, శేఖర్ కమ్ములతో కలిసి దిగిన సెల్ఫీని పోస్ట్ చేశారు. త్వరలో కలుద్దాం అని ట్వీట్ చేశారు.దిల్రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తర్వాతి షూటింగ్ షెడ్యూల్ అమెరికాలో జరగనున్నట్లు తెలుస్తోంది.అమెరికా అబ్బాయి, తెలంగాణ అమ్మాయి ఒకరినొకరు ఎలా ఇష్టపడ్డారన్న నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి శక్తికాంత్ స్వరాలు సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









