'ఫిదా' చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి
- September 08, 2016
వరుణ్తేజ్ కథానాయకుడిగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫిదా' చిత్రం నిజామాబాద్ జిల్లా బాన్స్వాడలో షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. హీరో వరుణ్తేజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తొలి షెడ్యూల్ పూర్తయినట్లు అభిమానులకు తెలిపారు. బాన్స్వాడ షూటింగ్ చాలా సరదాగా జరిగిందని, ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నామని పేర్కొంటూ.. కథానాయిక సాయిపల్లవి, శేఖర్ కమ్ములతో కలిసి దిగిన సెల్ఫీని పోస్ట్ చేశారు. త్వరలో కలుద్దాం అని ట్వీట్ చేశారు.దిల్రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తర్వాతి షూటింగ్ షెడ్యూల్ అమెరికాలో జరగనున్నట్లు తెలుస్తోంది.అమెరికా అబ్బాయి, తెలంగాణ అమ్మాయి ఒకరినొకరు ఎలా ఇష్టపడ్డారన్న నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి శక్తికాంత్ స్వరాలు సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







