గ్యాస్ వాల్వ్ తెరిచిన కారణంగా దుబాయ్ లోని అల్ ఖైల్ గేట్ వద్ద పేలుడు
- September 08, 2016
దుబాయ్: గత నెలలో అల్ ఖైల్ గేట్ కమ్యూనిటీ భవనం ఒక అపార్ట్మెంట్ లో జరిగిన సిలెండర్ పేలుడు కారణం వెల్లడి కాబడ్డాయి. స్టవ్ వాల్వ్ ని తెరిచిన నేపథ్యంలో వెలువడిన వాయువు ద్వారా విస్ఫోటనం వాటిల్లింది.గత నెల ఆగస్టు 24 వ తేదీన ఉదయం 11.20 సమయంలో జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడులో ఇరువురు మహిళలు గాయపడగా ఒక శిశువు స్వల్ప గాయాలతో బయటపడ్డారు అయితే, ఇద్దరు స్త్రీలు గాయపడ్డారు. ఆస్పత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, 60 ఏళ్ళ షిరిన్ గాంధీ, మరియు 35 ఏళ్ళ మరియం గాంధీలుగా గుర్తించారు.మరియం ఆసుపత్రిలో ఒక క్లిష్టమైన స్థితిలోనే ఉంది అయితే షిరిన్ ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. దుబాయ్ పోలీస్ ఫోరెన్సిక్ సైన్స్ అండ్ క్రిమినాలజీ శాఖ ఫోరెన్సిక్ ఇంజనీరింగ్ విభాగం నుండి, అగ్నిప్రమాద నివారణ నిపుణుడు మహ్మద్ అబూ ఈత మాట్లాడుతూ విచారణ ఫలితాలలో ఈ అగ్ని ప్రమాదం ఒక గ్యాస్ పేలుడు కారణంగా జరిగినట్లుగా నిర్ధారించామని ఆయన అన్నారు."మేము గ్యాస్ ఎలా విడుదల కాబడిందోనని మూలం కోసం తనిఖీ చేశామని .గ్యాస్ సిలిండర్ యొక్క వాల్వ్ మరియు రబ్బరు ట్యూబ్ మరియు స్టవ్ మధ్య కనెక్ట్ పాయింట్ స్టవ్ అనుసంధానిస్తూ రబ్బరు గొట్టం మధ్య కనెక్షన్ తనిఖీ చేసి చూడగా గ్యాస్ వెలుపలికి రావడానికి మూలం కనుగొనినట్లు తెలిపారు. మా పరిశీలనలో స్టవ్ యొక్క నాబ్ ల వాల్వ్ తెరిచి ఉంది. దీని ఫలితమే ఈ సంఘటన జరగడానికి ముఖ్య కారణంకాబడిందని ఆయన తెలిపారు. గ్యాస్ సిలిండర్లలో వంట గ్యాస్ కోసం ఉపయోగించే ఆ గ్యాస్ ఎప్పుడైతే లికేజ్ కాబడిందో అది గాలిలో ఆక్సిజన్ తో కలవడం మొదలవుతుంది. మండే వాయువు నిష్పత్తి పెరిగి గాలిని చేరుకునే సమయానికి శాస్త్రవేత్తలు ఒక "పేలుడు పరిమితి" ఏర్పడవచ్చని తెలిపారు. ఇటువంటి స్థితిలో ఒక లైట్ స్విచ్ నొక్కడం ద్వారా ఒక భారీ పేలుడుకి కారణం కాబడినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్







