గ్యాస్ వాల్వ్ తెరిచిన కారణంగా దుబాయ్ లోని అల్ ఖైల్ గేట్ వద్ద పేలుడు
- September 08, 2016
దుబాయ్: గత నెలలో అల్ ఖైల్ గేట్ కమ్యూనిటీ భవనం ఒక అపార్ట్మెంట్ లో జరిగిన సిలెండర్ పేలుడు కారణం వెల్లడి కాబడ్డాయి. స్టవ్ వాల్వ్ ని తెరిచిన నేపథ్యంలో వెలువడిన వాయువు ద్వారా విస్ఫోటనం వాటిల్లింది.గత నెల ఆగస్టు 24 వ తేదీన ఉదయం 11.20 సమయంలో జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడులో ఇరువురు మహిళలు గాయపడగా ఒక శిశువు స్వల్ప గాయాలతో బయటపడ్డారు అయితే, ఇద్దరు స్త్రీలు గాయపడ్డారు. ఆస్పత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, 60 ఏళ్ళ షిరిన్ గాంధీ, మరియు 35 ఏళ్ళ మరియం గాంధీలుగా గుర్తించారు.మరియం ఆసుపత్రిలో ఒక క్లిష్టమైన స్థితిలోనే ఉంది అయితే షిరిన్ ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. దుబాయ్ పోలీస్ ఫోరెన్సిక్ సైన్స్ అండ్ క్రిమినాలజీ శాఖ ఫోరెన్సిక్ ఇంజనీరింగ్ విభాగం నుండి, అగ్నిప్రమాద నివారణ నిపుణుడు మహ్మద్ అబూ ఈత మాట్లాడుతూ విచారణ ఫలితాలలో ఈ అగ్ని ప్రమాదం ఒక గ్యాస్ పేలుడు కారణంగా జరిగినట్లుగా నిర్ధారించామని ఆయన అన్నారు."మేము గ్యాస్ ఎలా విడుదల కాబడిందోనని మూలం కోసం తనిఖీ చేశామని .గ్యాస్ సిలిండర్ యొక్క వాల్వ్ మరియు రబ్బరు ట్యూబ్ మరియు స్టవ్ మధ్య కనెక్ట్ పాయింట్ స్టవ్ అనుసంధానిస్తూ రబ్బరు గొట్టం మధ్య కనెక్షన్ తనిఖీ చేసి చూడగా గ్యాస్ వెలుపలికి రావడానికి మూలం కనుగొనినట్లు తెలిపారు. మా పరిశీలనలో స్టవ్ యొక్క నాబ్ ల వాల్వ్ తెరిచి ఉంది. దీని ఫలితమే ఈ సంఘటన జరగడానికి ముఖ్య కారణంకాబడిందని ఆయన తెలిపారు. గ్యాస్ సిలిండర్లలో వంట గ్యాస్ కోసం ఉపయోగించే ఆ గ్యాస్ ఎప్పుడైతే లికేజ్ కాబడిందో అది గాలిలో ఆక్సిజన్ తో కలవడం మొదలవుతుంది. మండే వాయువు నిష్పత్తి పెరిగి గాలిని చేరుకునే సమయానికి శాస్త్రవేత్తలు ఒక "పేలుడు పరిమితి" ఏర్పడవచ్చని తెలిపారు. ఇటువంటి స్థితిలో ఒక లైట్ స్విచ్ నొక్కడం ద్వారా ఒక భారీ పేలుడుకి కారణం కాబడినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







