ఒమన్లో జీతాలందక వలస కార్మికుల ఆందోళన
- September 09, 2016
డజన్ల సంఖ్యలో ఆగ్రహావేశాలతో ఉన్న కార్మికులు ఒమన్లో ఆందోళన చేపట్టారు. వారు పనిచేస్తున్న కంపెనీ, జీతాల్ని నిలిపివేయడం, అలాగే ఎంప్లాయ్మెంట్ వీసాల్ని పునరుద్ధరించకపోవడంతో తాము ఆందోళన చేపట్టినట్లు వలస కార్మికులు తెలిపారు. మస్కట్లోని ఓ కన్స్ట్రక్షన్ సైట్లో 80 మంది వరకు కార్మికులు, ఉద్యోగం కోల్పోయి, జీతం అందక, సరైన ఆహారం, వైద్య సహాయం లేకుండా గత నాలుగు నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిలో కొందరు ఉద్యోగాలకు రాజీనామా చేయగా, ఆ రాజీనామాల్ని ఆ కంపెనీ ఆమోదించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో వారి వీసా కూడా ఎక్స్పైర్ కావడంతో ఎటూ వెళ్ళలేని పరిస్థితి. అందుకే వారంతా అక్రమంగా ఒమన్లో నివసిస్టున్నట్లయ్యింది. ఈ ఏడాది ఇప్పటివరకూ కేవలం మూడు నుంచి నాలుగు నెలల జీతం మాత్రమే వారిలో కొంతమంది అందుకున్నారు. మిగతావారి జీతాలు పెండింగ్లో ఉన్నాయి. కంపెనీ వర్గాలు వాటిని ఎప్పుడు క్లియర్ చేస్తుందో తెలియని పరిస్థితి. అయితే ఒమన్లోని ట్రేడ్ యూనియన్ లీడర్స్, కంపెనీలు ఇలా కార్మికుల్ని రోడ్డున పడేయడం తగదని చెబుతున్నారు. అయితే, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు అధ్వాన్నంగా ఉండటంతోనే తాము ఏమీ చేయలేకపోతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన
- బహ్రెయిన్లో ‘అఖండ–2’ ఉచిత ప్రీమియర్ బెనిఫిట్ షో
- ఘనంగా సుల్తాన్ సాయుధ దళాల వార్షిక దినోత్సవం..!!
- యునెస్కో వారసత్వ జాబితాలో దీపావళి..!!
- కువైట్ మునిసిపాలిటీ స్పెషల్ ఆపరేషన్.. 19 వాహనాలు సీజ్..!!
- ఖతార్ పీఎంతో యూఎన్ఓ సెక్రటరీ జనరల్ చర్చలు..!!
- యూఏఈలో జనవరి 1న పెయిడ్ హాలీడే..!!
- జెడ్డా బుక్ ఫెయిర్ 2025లో ప్రసిద్ధ సినిమాల షో..!!







