బాగ్దాద్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది...
- September 09, 2016
ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరం మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. సెంట్రల్ బాగ్దాద్లోని ఓ షాపింగ్ మాల్ వద్ద రెండు కారు బాంబులు పేలడంతో పది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 28 మంది గాయాలపాలైనట్లు పోలీసులు వెల్లడించారు. నఖీల్ మాల్ వెలుపల అర్థరాత్రి సమయంలో పేలుడు పదార్థాలతో కూడిన కార్లలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు పోలీసు అధికారి తెలిపారు. త్వరలో బక్రీద్ ఉండడం, వారాంతం కావడంతో షాపింగ్ మాల్ అర్థరాత్రి తర్వాత కూడా తెరిచే ఉందని చెప్పారు. షాపింగ్ మాల్ లోపల ఎవ్వరూ గాయపడలేదని, బయట ఉన్న వారిపై ప్రభావం పడిందని అంతర్గత మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు.పది మంది మరణించినట్లు ధ్రువీకరించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. బాగ్దాద్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తరచూ దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







