పవన్ కళ్యాణ్ పై తెలంగాణా అడ్వొకేట్ల జెఎసి మండిపడింది..

- September 11, 2016 , by Maagulf
పవన్ కళ్యాణ్ పై తెలంగాణా అడ్వొకేట్ల జెఎసి మండిపడింది..

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ పై తెలంగాణా అడ్వొకేట్ల జెఎసి మండిపడింది. కాకినాడలో పవన్ చేసిన ప్రసంగం తమ సెంటిమెంట్లను గాయపరిచిందని ఆరోపిస్తూ కొందరు లాయర్లు హైదరాబాద్ నాంపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఒక వ్యక్తి తన గెడ్డం గీసుకున్నంత తేలికగా కేంద్రం 2014 లో తెలంగాణాను వేరు చేసిందని పవన్ వ్యాఖ్యానించాడని, ఇది రెచ్చగొట్టే స్టేట్ మెంట్ అని వారు విమర్శించారు.
రాష్ట్ర విభజన జరిగాక మనో వేదనతో తాను 11 రోజులు ఆహారం తీసుకోలేదని పవన్ చేసిన వ్యాఖ్యలను కూడా వారు గుర్తు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య కలతలు రేపి వివాదాలు సృష్టించేవిగా ఉన్నాయని అన్నారు. కాగా పోలీసులు ఈ ఫిర్యాదును తీసుకున్నప్పటికీ ఎలాంటి కేసు నమోదు చేయలేదు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com