2025 ఫిడే ప్రపంచ రాపిడ్, బ్లిట్జ్ ఛాంపియన్షిప్లు ప్రారంభం..!!
- December 26, 2025
దోహా: 2025 ఫిడే ప్రపంచ రాపిడ్ మరియు బ్లిట్జ్ ఛాంపియన్షిప్లు నేడు దోహాలో ప్రారంభమవుతాయి. డిసెంబర్ 30 వరకు ఈ ప్రతిష్టాత్మక ప్రపంచ ఈవెంట్కు ఖతార్ ఆతిథ్యం ఇవ్వనుంది. పురుషుల రాపిడ్ ఛాంపియన్షిప్లో మొత్తం 251 మంది ఆటగాళ్లు, మహిళల విభాగంలో 142 మంది పాల్గొంటున్నారు.
ప్రస్తుత క్లాసికల్ ప్రపంచ ఛాంపియన్ అయిన భారత్ కు చెందిన గుకేశ్ దొమ్మరాజు, ప్రపంచ నంబర్ వన్ అయిన నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్సెన్ మరియు 2024 ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్ అయిన రష్యన్ గ్రాండ్మాస్టర్ ఇయాన్ నెపోమ్నియాచ్ఛి ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. ఈ జాబితాలో ఫాబియానో కరువానా, అనిష్ గిరి, వెస్లీ సో, లెవాన్ అరోనియన్ మరియు అలెగ్జాండర్ గ్రిషుక్ కూడా ఉన్నారు. వీరితోపాటు 15 ఏళ్ల రష్యన్ గ్రాండ్మాస్టర్ ఇవాన్ జెమ్లియాన్స్కీ మరియు 14 ఏళ్ల టర్కిష్ సంచలనం యాగిజ్ కాన్ ఎర్డోగ్ముస్ కూడా పోటీపడుతున్నారు.
ఇక ఖతార్ తరపున అంతర్జాతీయ మాస్టర్ హుస్సేన్ అజీజ్, ఖలీద్ అల్ జమాత్, హమద్ అల్ కువారీ మరియు ఇబ్రహీం అల్ జనహి ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఖతార్ చెస్ ఫెడరేషన్ అధ్యక్షుడు మొహమ్మద్ అల్ ముదహ్కా తెలిపారు. ఖతార్ చివరిసారిగా 2016లో రాపిడ్ మరియు బ్లిట్జ్ ప్రపంచ ఛాంపియన్షిప్లను నిర్వహించిందన్నారు. 400 మందికి పైగా చెస్ ప్లేయర్లు పోటీ పడుతున్నారని, మొత్తం బహుమతి నిధి EUR 1 మిలియన్లకు దగ్గరగా ఉంటుందని FIDE అధ్యక్షుడు అర్కాడీ డ్వోర్కోవిచ్ వెల్లడించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









