అబుదాబిలో ఇంట్లో చలిమంటలు..ఐదుగురికి అస్వస్థత..!!
- December 26, 2025
యూఏఈ: అబుదాబిలో ఇంట్లో చలి మంటలు వేసుకొని ఐదుగురు వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. కాగా, రెస్క్యూ టీమ్ సకాలంలో స్పందించడంతో ప్రాణనష్టం జరగలేదని అబుదాబి పోలీసులలోని క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ డైరెక్టర్ మేజర్ జనరల్ మొహమ్మద్ సుహైల్ అల్ రష్ది తెలిపారు. మూసివేసిన ప్రదేశాలలో మంటలు వేసుకోవడం ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందన్నారు.
ఇళ్లలో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలని ప్రజలను కోరారు.
ఇళ్ళు లేదా గదుల లోపల కట్టెలు లేదా బొగ్గును ఉపయోగించి మంటలను వెలిగించవద్దని అల్ ఐన్ పోలీస్ డైరెక్టరేట్ డైరెక్టర్ బ్రిగేడియర్ సయీద్ హుమైద్ బిన్ దల్మౌజ్ అల్ ధహేరి హెచ్చరించారు. ముఖ్యంగా రాత్రిపూట కట్టెల హీటర్లను ఉపయోగించవద్దని, ఊపిరాడకుండా లేదా మంటలు వచ్చే ప్రమాదం ఉన్నందున వాటి పక్కన పడుకోవద్దని ఆయన సూచించారు.తగినంత వెంటిలేషన్ ఉండేలా చూసుకుంటూ, అటువంటి హీటర్లను గదుల వెలుపల వెలిగించాలని లేదా పొగ బయటకు వెళ్లడానికి ప్రత్యేక ఎగ్జాస్ట్ వ్యవస్థలతో అమర్చాలని బ్రిగేడియర్ అల్ ధహేరి సూచించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







