కువైట్ లో ఎనర్జీ డ్రింక్స్ పై నిషేధం..!!
- December 26, 2025
కువైట్: కువైట్ లో ఎనర్జీ డ్రింక్స్ లను నిషేదిస్తూ ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అబ్దుల్ వహాబ్ అల్-అవది ఎనర్జీ ఉత్తర్వులను జారీ చేశారు. ఎనర్జీ డ్రింక్స్ అమ్మకం 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు మాత్రమే అమ్మాలని ఉత్తర్వుల్లో సూచించారు. అలాగే, రోజువారీ వినియోగాన్ని ఒక వ్యక్తికి గరిష్టంగా రెండు డబ్బాలకు మాత్రమే పరిమితం చేశారు. ఉత్తర్వుల ప్రకారం ఉత్పత్తిదారులు మరియు దిగుమతిదారులు ఎనర్జీ డ్రింక్ ప్యాకేజింగ్పై స్పష్టమైన మరియు ఆరోగ్య సంబంధిత హెచ్చరికలను ముద్రించాలి.
అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మరియు కమ్యూనిటీ విద్యా సంస్థలలో, అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు మరియు యూనివర్సిటీల్లో ఎనర్జీ డ్రింక్స్ అమ్మకాలను నిషేధించారు. రెస్టారెంట్లు, కేఫ్లు, కిరాణా దుకాణాలు, అన్ని రకాల ఫుడ్ ట్రక్కులు, వెండింగ్ మెషీన్ల ద్వారా ఎనర్జీ డ్రింక్స్ అమ్మకాలపై కూడా నిషేధం విధించారు.
తాజా వార్తలు
- తిరుమల బ్రహ్మోత్సవాలు ఖరారు.. సెప్టెంబర్ 15 నుంచి శ్రీవారి ఉత్సవాలు
- బహ్రెయిన్-సౌదీ మధ్య సరిహద్దు ట్యాక్సీ సేవలు ప్రారంభం..
- ఖతార్ అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం..!!
- సౌదీ సార్వభౌమత్వ రక్షణకు రాజీ పడబోము..!!
- యూఎన్- బహ్రెయిన్ భాగస్వామ్యం.. కీలక రంగాల్లో పురోగతి..!!
- సబ్సిడీ డీజిల్ చోరీ కేసుల్లో 21 ట్యాంకర్లు, ట్రక్కులు సీజ్..!!
- కువైట్లో భారతీయ నర్సు మృతి..!!
- యూఏఈ స్కూళ్లలో స్కాలర్షిప్లు.. 50 శాతం వరకు ఫీజు రాయితీ..!!
- ది హేగ్ ఎంబసీ ఫెస్టివల్లో ఒమన్ సాంస్కృతిక వైభవం..!!
- అక్టోబర్ 7 దాడుల కథనంపై స్పందించిన ఎమిరేట్స్..!!







