కువైట్ లో ఎనర్జీ డ్రింక్స్ పై నిషేధం..!!
- December 26, 2025
కువైట్: కువైట్ లో ఎనర్జీ డ్రింక్స్ లను నిషేదిస్తూ ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అబ్దుల్ వహాబ్ అల్-అవది ఎనర్జీ ఉత్తర్వులను జారీ చేశారు. ఎనర్జీ డ్రింక్స్ అమ్మకం 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు మాత్రమే అమ్మాలని ఉత్తర్వుల్లో సూచించారు. అలాగే, రోజువారీ వినియోగాన్ని ఒక వ్యక్తికి గరిష్టంగా రెండు డబ్బాలకు మాత్రమే పరిమితం చేశారు. ఉత్తర్వుల ప్రకారం ఉత్పత్తిదారులు మరియు దిగుమతిదారులు ఎనర్జీ డ్రింక్ ప్యాకేజింగ్పై స్పష్టమైన మరియు ఆరోగ్య సంబంధిత హెచ్చరికలను ముద్రించాలి.
అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మరియు కమ్యూనిటీ విద్యా సంస్థలలో, అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు మరియు యూనివర్సిటీల్లో ఎనర్జీ డ్రింక్స్ అమ్మకాలను నిషేధించారు. రెస్టారెంట్లు, కేఫ్లు, కిరాణా దుకాణాలు, అన్ని రకాల ఫుడ్ ట్రక్కులు, వెండింగ్ మెషీన్ల ద్వారా ఎనర్జీ డ్రింక్స్ అమ్మకాలపై కూడా నిషేధం విధించారు.
తాజా వార్తలు
- ఇరాన్ తో యుద్ధం..అమెరికా సంచలన ప్రకటన..
- హైదరాబాద్లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!









