కాణిపాకంలో పెరిగిన భక్తుల రద్దీ
- December 26, 2025
కాణిపాకం: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి అలయం గురువారం పోటెత్తిన భక్తుల రద్దీతో జనసంద్రంగా తయారైంది. సాధారణంగా ఆలయంలో వారంతపు రోజులు, వరుస సెలవు రోజుల్లో భక్తుల రద్దీ వుంటుంది. అయితే గత కొద్ది రోజులుగా శబరిమల ఆలయంలో దర్శనాలు ప్రారంభం కావడంతో అయ్యప్ప దర్శనం కోసం వెళ్ళిన భక్తులు మరో వైపు ఓంశక్తి మాలధారణ చేసిన భక్తులు కాణిపాకం ఆలయ దర్శనార్థం భారీగా తరలివచ్చారు.అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు కాణిపాకం స్వామి దర్శనం కోసం పెద్దఎత్తున తరలివచ్చారు. సాధారణ భక్తులతో పాటు తిరుమల వెళ్ళే తీర్థజనం, అయ్యప్ప, ఓంశక్తి భక్తులు తరలిరావడంతో ఆలయంలో తీవ్రస్థాయిలో రద్దీ నెలకొంది. భక్తులు వేకువజామున నుండి స్వామి దర్శనంకోసం క్యూలైన్లలో బారులు తీరి నిలబడడంతో ఆలయంలోని క్యూలైన్లన్ని భక్తులతో కిటకిటలాడాయి.
ఆలయ క్యూకాంప్లెక్స్, క్యూలైన్లు పూర్తిగా నిండిపోవడంతో ఆలయం వెలుపల భక్తులు గంటల తరబడి స్వామి దర్శనం కోసం బారులు తీరి వేచి వుండాల్సిన పరిస్థితి నెలకొంది.100 రూపాయల శీఘ్రదర్శనం,150 రూపాయల అతిశీఘ్రదర్శనం టిక్కెట్లు తీసుకున్న భక్తులు సైతం క్యూకాంప్లెక్స్, క్యూలైన్లులో గంటల తరబడి వేచివుండడం గమనార్హం. సర్వదర్శనం భక్తులు సమారు నాలుగు గంటలకు పైగా కూలైన్లులో స్వామివారి దర్శనం కోసం వేచివుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలన్ని జనసందంగా మారింది. దీనితో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!
- ప్రైవేట్ ప్రయాణ ఏర్పాట్ల పై ఎంబసీ కీలక సూచనలు..!!
- నువైసీబ్ బార్డర్ వద్ద సెక్యూరిటీ రేడినెస్ పై సమీక్ష..!!
- యూఏఈ కాన్సులేట్ పై దాడిని ఖండించిన ఒమన్..!!
- ఉరుములతో కూడిన వర్షాలు..హెచ్చరించిన సివిల్ డిఫెన్స్..!!
- ఘోర బస్సు ప్రమాదం: ఆరుగురు సజీవదహనం
- సౌదీ వైమానిక రక్షణ దళాల పై క్యాబినెట్ ప్రశంసలు..!!
- డే 12: ఇరాన్ డ్రోన్లు, మిస్సైల్స్ ను అడ్డుకున్న UAE ఎయిర్ డిఫెన్స్..!!
- బ్రేకింగ్: సంక్షోభంలోనూ స్థిరంగా బంగారం..ఇన్వెస్టర్లను ఊరిస్తున్న మార్కెట్!









