పాన్-ఆధార్ లింకింగ్ కు రేపే చివరి తేదీ
- December 30, 2025
న్యూ ఢిల్లీ: భారత ప్రభుత్వం పాన్ కార్డ్ను ఆధార్ కార్డుతో అనుసంధానించడం తప్పనిసరి అని వెల్లడించింది.దీని చివరి గడువు డిసెంబర్ 31, 2025. గడువు ముగిసిన తర్వాత లింక్ చేయని పాన్ కార్డులు జనవరి 1, 2026 నుండి పనిచేయవు.
లింక్ చేయకపోతే ₹1,000 జరిమానా విధించబడుతుంది.అలాగే, పాన్ ఆధార్ లింక్ కానివాటికి బ్యాంక్ లావాదేవీలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, క్రెడిట్, పన్ను రిటర్న్ ఫైలింగ్ వంటి ఆర్థిక కార్యకలాపాల్లో సమస్యలు తలెత్తవచ్చు.
మీరు మీ పాన్-ఆధార్ లింక్ స్టేటస్ను http://www.incometax.gov.inవెబ్సైట్ లేదా SMS ద్వారా తనిఖీ చేసుకోవచ్చు. SMS కోసం [ఆధార్ నంబర్] [పాన్ నంబర్] 567678/56161 ఫార్మాట్లో పంపాలి.
ప్రభుత్వం ఆన్లైన్ సౌకర్యాలు కూడా అందిస్తోంది. సమస్యలు ఎదురైతే ITD హెల్ప్లైన్(Helpline) లేదా సపోర్ట్ సెంటర్ ద్వారా సహాయం పొందవచ్చు. ఈ మార్పులతో పాన్ మరియు ఆధార్ అనుసంధానం సులభం అవుతుంది, పన్ను వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుంది.
తాజా వార్తలు
- ఉరుములతో కూడిన వర్షాలు..హెచ్చరించిన సివిల్ డిఫెన్స్..!!
- ఘోర బస్సు ప్రమాదం: ఆరుగురు సజీవదహనం
- సౌదీ వైమానిక రక్షణ దళాల పై క్యాబినెట్ ప్రశంసలు..!!
- డే 12: ఇరాన్ డ్రోన్లు, మిస్సైల్స్ ను అడ్డుకున్న UAE ఎయిర్ డిఫెన్స్..!!
- బ్రేకింగ్: సంక్షోభంలోనూ స్థిరంగా బంగారం..ఇన్వెస్టర్లను ఊరిస్తున్న మార్కెట్!
- చిన్ననోట్ల కోసం ప్రత్యేక ఏటీఎంలు, కేంద్రం కీలక నిర్ణయం
- ఇరాన్ తో యుద్ధం..అమెరికా సంచలన ప్రకటన..
- హైదరాబాద్లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా









