ఈద్ ఉత్సవాల వేళ చిన్న నిరాశ
- September 12, 2016అబుదబీ: యూఏఈలోని పలు కుటుంబాల్లో ఈద్ అల్ అదా సందర్భంగా చిన్న నిరాశ కనిపిస్తోంది. ఆయా కుటుంబాల్లోని కొందరు హజ్ యాత్రలో ఉండటంతో సంప్రదాయంగా ఉన్న కొన్ని సెంటిమెంట్లను పాటించలేకపోతున్నామని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే హజ్ యాత్ర ఎంతో పవిత్రమైనదని వారు చెబుతున్నారు. 'నా భర్త ఓ మంచి కార్యం కోసం మాకు దూరమయ్యారన్న విషయాన్ని మేం అర్థం చేసుకోగలం. ఈద్ శుభ వేళ కుటుంబ పెద్ద లేకపోవడం కొంచెం బాధ కలిగిస్తోంది' అని భారతదేశానికి చెందిన 30 ఏళ్ళ షబ్నమ్ మొయిదీన్ చెప్పారు. ప్రతి సంవత్సరం ఈద్ అల్ అదా సెలబ్రేషన్స్, వార్షిక హజ్ యాత్రతో లింక్ చేయబడి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా హజ్ యాత్రీకులు సౌదీ అరేబియాలోని మక్కాకి చేరుకుని పవిత్ర ప్రార్థనలు నిర్వహిస్తారు. యూఏఈలోని వలసదారులైన హజ్ యాత్రీకులు కుటుంబాలతో కలిసి హజ్ యాత్రకు వెళుతుంటారు. కుటుంబాన్ని వదిలి కుటుంబ పెద్దలు ఇతర కుటుంబ సభ్యులు వెళ్ళినప్పుడు మాత్రం, తమవారి క్షేమం కోసం ఈద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరుగుతుంటుంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం