పారా ఒలింపిక్స్లో బహ్రెయిన్కి తొలి గోల్డ్ మెడల్
- September 12, 2016
మనామా: 2016 రియో పారా ఒలింపిక్ గేమ్స్లో బహ్రెయిన్కి తొలి గోల్డ్ మెడల్ అభించింది. షాట్పుట్ కాంపిటీషన్లో బహ్రెయిన్కి చెందిన ఫాతిమా అబ్దుల్ రజాక్ గోల్డ్ మెడల్ని కైవసం చేసుకుంది. 4.76 మీటర్ల రికార్డ్ సాధించింది ఫాతిమా. భారత్కి చెందిన దీపా మాలిక్, గ్రీక్కి చెందిన డిమిత్రా కోరకిడాతో తలపడ్డ ఫాతిమా మొదటి స్థానాన్ని గెల్చుకుంది. దీపా మాలిక్కి ఈ విభాగంలో రజత పతకం లభించింది. బహ్రెయిన్ డిజేబుల్డ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ దుయైజ్ అల్ ఖలీఫా, ఈ మెడల్ని కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతోపాటు ్పఐమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, డిప్యూటీ సుప్రీం కమాండర్ అండ్ ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా, తదరులకు అంకితం చేశారు. షేక్ మొహమ్మద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈద్ అల్ అదా సందర్భంగా బహ్రెయిన్ ఈ ఘనతను సాధించడం అద్భుతమని కొనియాడారు. రియో 2016 పారా ఒలింపిక్ గేమ్స్లో 170 దేశాలకు చెందిన 4,500 మంది క్రీడాకారులు 32 ఈవెంట్లలో 526 మెడల్స్ కోసం పోటీ పడుతున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







