పాకిస్థాన్‌లో ఈద్ ప్రార్థనల సందర్భంగా పేలుడు..

- September 13, 2016 , by Maagulf
పాకిస్థాన్‌లో ఈద్ ప్రార్థనల సందర్భంగా పేలుడు..

పాకిస్థాన్‌లో ఈద్ ప్రార్థనల సందర్భంగా పేలుడు జరిగింది. సింధ్ రాష్ట్రంలోని ఓ మసీదులో ప్రార్థనలకు ముస్లింలు పెద్ద సంఖ్యలో తరలిరాగా ఇద్దరు వ్యక్తులు ఆత్మాహుతి బాంబు దాడులకు ప్రయత్నించారు. గేటు వద్ద పోలీసులు ఓ వ్యక్తిని నిలువరించేందుకు ప్రయత్నించగా తనను తాను పేల్చుకున్నాడు. దీంతో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మసీదులోకి చొరబడేందుకు ప్రయత్నించిన మరో ఆత్మాహుతి వ్యక్తిపై పోలీసులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఎదురు కాల్పుల్లో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com