'ఆధార్' తప్పనిసరి రైల్ టిక్కెట్ బుకింగ్కు..
- September 13, 2016
రైల్ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటారా? ఇక తప్పనిసరిగా ఆధార్ నెంబర్ను జత చేయాల్సిందే. త్వరలోనే ఈ విధానం అమల్లోకి రాబోతోందని రైల్వే వర్గాలు తెలిపాయి. ట్రైన్ టికెట్లకు ఆధార్ వివరాలు అనుసంధానించేలా ఒక విధానాన్ని తీసుకు రావాలని రైల్వే శాఖ చాలాకాలంగా కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించిన తుది విధానం మరో పదిహేను రోజుల్లో ఖరారు కానుందని తెలుస్తోంది. ఆ ప్రకారం కౌంటర్లు, ఆన్లైన్లో రిజర్వేషన్, అన్రిజర్వ్డ్ టిక్కెట్లకు ఆధార్ వివరాలను ప్రయాణికులు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇందువల్ల భారీగా టిక్కెట్లను ముందుగానే బ్లాక్ చేసి పెట్టే దళారుల బెడద నివారించవచ్చని రైల్వే శాఖ యోచనగా ఉంది.అడ్వాన్స్గా టిక్కెట్లు రిజర్వ్ చేసుకోవాలనుకునే వారికి దళారుల కారణంగా టిక్కెట్లు దొరకడం లేదు. ఈ సమస్యలపై దృష్టి సారించిన రైల్వే శాఖ ఆధార్ను జతచేయడం తప్పనిసరి చేస్తూ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.
తాజా వార్తలు
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి







