ఎయిర్‌ ఏషియా ఉచిత ఆఫర్‌..

- September 13, 2016 , by Maagulf
ఎయిర్‌ ఏషియా ఉచిత ఆఫర్‌..

 కావేరీ గొడవల నేపథ్యంలో బెంగళూరు నుంచి పొరుగు రాష్ట్రాలకు వెళ్ళే ప్రయాణీకులకు ఎయిర్‌ ఏషియా ఉచిత ఆఫర్‌ ఇచ్చింది. సోమవారం బెంగళూరులో తలెత్తిన హింసాత్మక సంఘటనల దృష్ట్యా రాత్రికి రాత్రే తన నిర్ణయాన్ని ప్రకటించింది. కెంపేగౌడ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌, చెన్నై, గోవా, ముంబై తదితర ప్రాంతాలకు వెళ్లదలచిన ప్రయాణీకులకు ఎటువంటి చార్జీలు లేకుండానే అవకాశం కల్పించింది. ప్రయాణీకుల పరిస్థితి అర్థం చేసుకొనే ఎయిర్‌ ఏషియా సంస్థ ని ర్ణయం తీసుకున్నట్లు సంస్థ డైరెక్టర్‌ బెంగళూరులో ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com