ట్రాఫిక్ జామ్లో ఇరుక్కునేవారికి ఓ హెచ్చరిక..!
- September 13, 2016
తరచూ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కునేవారు కేన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు పరిశోధకులు. ట్రాఫిక్ జామ్లో వాహనాల నుంచి వెలువడే పొగ, దుమ్ము వంటి విషవాయువుల కారణంగా కొన్ని రకాల కేన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. ట్రాఫిక్ జామ్లో ఉన్న సమయంలో కారులో ఉన్నవారు తలుపులు మూసివేయడంతో పాటు లోపల ఫ్యాన్లు కూడా ఆపేయాలని, తరచూ హెడ్లైట్లు ఆర్పడం, వేయడం వంటివి చేయకూడదని వారు సూచిస్తున్నారు. కారు ఆగిఉన్న సమయంలో రహదారుల మీద దుమ్ము, పొగ ఫ్యాన్లోకి ప్రవేశించి వారి శరీరంలోకి చొరబడే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. ట్రాఫిక్ జామ్లో హారన్ల రొద కారణంగా ఒత్తిడి, ఆందోళన ఎక్కువ అవుతాయని వారు గుర్తు చేస్తున్నారు.సాధ్యమైనంత వరకూ వాహన కాలుష్యం నుంచి తప్పించుకోగలిగితే కేన్సర్ ముప్పు తగ్గుతుందని వారు వివరించారు. అయితే ట్రాఫిక్ జామ్ వల్ల ఆరోగ్య నష్టం పాదచారుల మరింత ఎక్కువగా ఉంటుందని మరొక పరిశోధనలో వెల్లడైంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







