ట్రాఫిక్ జామ్లో ఇరుక్కునేవారికి ఓ హెచ్చరిక..!
- September 13, 2016
తరచూ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కునేవారు కేన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు పరిశోధకులు. ట్రాఫిక్ జామ్లో వాహనాల నుంచి వెలువడే పొగ, దుమ్ము వంటి విషవాయువుల కారణంగా కొన్ని రకాల కేన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. ట్రాఫిక్ జామ్లో ఉన్న సమయంలో కారులో ఉన్నవారు తలుపులు మూసివేయడంతో పాటు లోపల ఫ్యాన్లు కూడా ఆపేయాలని, తరచూ హెడ్లైట్లు ఆర్పడం, వేయడం వంటివి చేయకూడదని వారు సూచిస్తున్నారు. కారు ఆగిఉన్న సమయంలో రహదారుల మీద దుమ్ము, పొగ ఫ్యాన్లోకి ప్రవేశించి వారి శరీరంలోకి చొరబడే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. ట్రాఫిక్ జామ్లో హారన్ల రొద కారణంగా ఒత్తిడి, ఆందోళన ఎక్కువ అవుతాయని వారు గుర్తు చేస్తున్నారు.సాధ్యమైనంత వరకూ వాహన కాలుష్యం నుంచి తప్పించుకోగలిగితే కేన్సర్ ముప్పు తగ్గుతుందని వారు వివరించారు. అయితే ట్రాఫిక్ జామ్ వల్ల ఆరోగ్య నష్టం పాదచారుల మరింత ఎక్కువగా ఉంటుందని మరొక పరిశోధనలో వెల్లడైంది.
తాజా వార్తలు
- మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- భారత్-కివీస్ టీ20 ఫైనల్..
- మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్
- ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్
- 6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!









