దుబాయ్ లో బస్సు ఎక్కే ప్రయాణీకుల సంఖ్య వృద్ధి

- September 15, 2016 , by Maagulf
దుబాయ్ లో  బస్సు ఎక్కే  ప్రయాణీకుల సంఖ్య వృద్ధి

దుబాయ్: దుబాయ్ యొక్క ప్రజా రవాణా బస్సులలో ప్రయాణించేవారు సంఖ్య  గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది మొదటి సగం లోనే  4.6  శాతంపెరిగిందని  రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్.టి.ఎ) బుధవారం వెల్లడించింది. 2015 లో ఇదే కాలంలో 66.703.583 బస్సులు ఎక్కే వారితో పోలిస్తే,ఆర్.టి.ఎ యొక్క పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ పబ్లిక్ బస్సులలో ఈ ఏడాది 70.732.502  మంది  బస్సులలో  ప్రయాణిస్తున్నట్లు  వెల్లడించింది.

డైరెక్టర్ ఆర్.టి.ఎ యొక్క పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ బస్సెల్  సాద్  ఇబ్రహీం మాట్లాడుతూ  దుబాయ్ లో  ప్రజా రవాణా కోసం ప్రభుత్వ బస్సులని  ఉపయోగించడంలో వినియోగదారుల పెరుగుతున్న కారణంగా  పలు కమ్యూనిటీ విభాగాలు మధ్య పెరుగుతున్న సంస్కృతికి ఇదో చిహ్నం అని ఆయన అన్నారు.అంతేకాక  మెట్రో, ట్రామ్ మరియు సముద్ర రవాణా రీతులు ఇతర ప్రజా రవాణా రీతులతో విలీనం కాబడి  ఒక సమర్థవంతమైన సేవ నిర్వహణని  ఆర్.టి.ఎ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రజా రవాణా నెట్వర్కు అలాగే మెట్రో, ట్రాం, సముద్ర రవాణా సౌకర్యాలు, అలాగే 100 ఎయిర్ కండిషన్డ్ బస్సు ఆశ్రయాలను ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందించి  ప్రజలకు స్మార్ట్ సేవలు అందిస్తున్నాయని ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com