సైమా మొదటి రోజు సందడి
- August 07, 2015
సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2015 (సైమా) వేడుక గురువారం రాత్రి దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని రషీద్ హాల్ లో ఘనంగా ప్రారంభమయింది. ఈ వేడుకలో దక్షిణ భారత సినీతారలు, ప్రముఖులు సందడి చేశారు. పలువురు తారలు చేసిన నృత్య ప్రదర్శనలు విశేషంగా అలరించాయి. తెలుగు నటులు రాణా, శ్రియ, మంచు లక్ష్మి, ఆలి తదితరులు వేదికపై తమదైన శైలిలో ప్రేక్షకులని అలరించారు. నటి ప్రణీత, ఆదాశర్మలు తమ నృత్య ప్రదర్సనలతో ఉర్రూతలూగించారు.రెండు రోజులపాటు నిర్వహించనున్న ఈ వేడుకల్లో స్వర్గీయ డి.రామానాయుడు గారికి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా డి.రామానాయుడు గారి జ్ఞాపికను విడుదలచేశారు. లెజెండ్ సినిమాకు గాను నందమూరి బాలకృష్ణ బెస్ట్ యాక్టర్ అవార్డు ను గెలుచుకున్నారు మరియు బెస్ట్ యక్ట్రెస్స్ గా శ్రుతి హాస్సన్ అవార్డు ను అందుకున్నారు. ప్రముఖ పాప్ గాయని ఉష ఉత్తప్ తమ స్వర మంత్రజాలంతో ప్రేక్షకులని మంతముగ్దులని చేశారు. ఆమె పాటలకి ప్రేక్షకులతో పాటు సినీతారలు కూడా స్టెప్పులు వేశారు. ఈ కార్యక్రమానికి ఆర్ కె మీడియా వారు మీడియా పార్ట్నెర్ గా వ్యవహరించారు.
_1438971584.jpg)


--- సి.శ్రీ (దుబాయ్)
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







