సైమా మొదటి రోజు సందడి
- August 07, 2015
సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2015 (సైమా) వేడుక గురువారం రాత్రి దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని రషీద్ హాల్ లో ఘనంగా ప్రారంభమయింది. ఈ వేడుకలో దక్షిణ భారత సినీతారలు, ప్రముఖులు సందడి చేశారు. పలువురు తారలు చేసిన నృత్య ప్రదర్శనలు విశేషంగా అలరించాయి. తెలుగు నటులు రాణా, శ్రియ, మంచు లక్ష్మి, ఆలి తదితరులు వేదికపై తమదైన శైలిలో ప్రేక్షకులని అలరించారు. నటి ప్రణీత, ఆదాశర్మలు తమ నృత్య ప్రదర్సనలతో ఉర్రూతలూగించారు.రెండు రోజులపాటు నిర్వహించనున్న ఈ వేడుకల్లో స్వర్గీయ డి.రామానాయుడు గారికి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా డి.రామానాయుడు గారి జ్ఞాపికను విడుదలచేశారు. లెజెండ్ సినిమాకు గాను నందమూరి బాలకృష్ణ బెస్ట్ యాక్టర్ అవార్డు ను గెలుచుకున్నారు మరియు బెస్ట్ యక్ట్రెస్స్ గా శ్రుతి హాస్సన్ అవార్డు ను అందుకున్నారు. ప్రముఖ పాప్ గాయని ఉష ఉత్తప్ తమ స్వర మంత్రజాలంతో ప్రేక్షకులని మంతముగ్దులని చేశారు. ఆమె పాటలకి ప్రేక్షకులతో పాటు సినీతారలు కూడా స్టెప్పులు వేశారు. ఈ కార్యక్రమానికి ఆర్ కె మీడియా వారు మీడియా పార్ట్నెర్ గా వ్యవహరించారు.
_1438971584.jpg)


--- సి.శ్రీ (దుబాయ్)
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







