సైమా మొదటి రోజు సందడి
- August 07, 2015
సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2015 (సైమా) వేడుక గురువారం రాత్రి దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని రషీద్ హాల్ లో ఘనంగా ప్రారంభమయింది. ఈ వేడుకలో దక్షిణ భారత సినీతారలు, ప్రముఖులు సందడి చేశారు. పలువురు తారలు చేసిన నృత్య ప్రదర్శనలు విశేషంగా అలరించాయి. తెలుగు నటులు రాణా, శ్రియ, మంచు లక్ష్మి, ఆలి తదితరులు వేదికపై తమదైన శైలిలో ప్రేక్షకులని అలరించారు. నటి ప్రణీత, ఆదాశర్మలు తమ నృత్య ప్రదర్సనలతో ఉర్రూతలూగించారు.రెండు రోజులపాటు నిర్వహించనున్న ఈ వేడుకల్లో స్వర్గీయ డి.రామానాయుడు గారికి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా డి.రామానాయుడు గారి జ్ఞాపికను విడుదలచేశారు. లెజెండ్ సినిమాకు గాను నందమూరి బాలకృష్ణ బెస్ట్ యాక్టర్ అవార్డు ను గెలుచుకున్నారు మరియు బెస్ట్ యక్ట్రెస్స్ గా శ్రుతి హాస్సన్ అవార్డు ను అందుకున్నారు. ప్రముఖ పాప్ గాయని ఉష ఉత్తప్ తమ స్వర మంత్రజాలంతో ప్రేక్షకులని మంతముగ్దులని చేశారు. ఆమె పాటలకి ప్రేక్షకులతో పాటు సినీతారలు కూడా స్టెప్పులు వేశారు. ఈ కార్యక్రమానికి ఆర్ కె మీడియా వారు మీడియా పార్ట్నెర్ గా వ్యవహరించారు.
_1438971584.jpg)


--- సి.శ్రీ (దుబాయ్)
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









