సైమా మొదటి రోజు సందడి
- August 07, 2015
సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2015 (సైమా) వేడుక గురువారం రాత్రి దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని రషీద్ హాల్ లో ఘనంగా ప్రారంభమయింది. ఈ వేడుకలో దక్షిణ భారత సినీతారలు, ప్రముఖులు సందడి చేశారు. పలువురు తారలు చేసిన నృత్య ప్రదర్శనలు విశేషంగా అలరించాయి. తెలుగు నటులు రాణా, శ్రియ, మంచు లక్ష్మి, ఆలి తదితరులు వేదికపై తమదైన శైలిలో ప్రేక్షకులని అలరించారు. నటి ప్రణీత, ఆదాశర్మలు తమ నృత్య ప్రదర్సనలతో ఉర్రూతలూగించారు.రెండు రోజులపాటు నిర్వహించనున్న ఈ వేడుకల్లో స్వర్గీయ డి.రామానాయుడు గారికి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా డి.రామానాయుడు గారి జ్ఞాపికను విడుదలచేశారు. లెజెండ్ సినిమాకు గాను నందమూరి బాలకృష్ణ బెస్ట్ యాక్టర్ అవార్డు ను గెలుచుకున్నారు మరియు బెస్ట్ యక్ట్రెస్స్ గా శ్రుతి హాస్సన్ అవార్డు ను అందుకున్నారు. ప్రముఖ పాప్ గాయని ఉష ఉత్తప్ తమ స్వర మంత్రజాలంతో ప్రేక్షకులని మంతముగ్దులని చేశారు. ఆమె పాటలకి ప్రేక్షకులతో పాటు సినీతారలు కూడా స్టెప్పులు వేశారు. ఈ కార్యక్రమానికి ఆర్ కె మీడియా వారు మీడియా పార్ట్నెర్ గా వ్యవహరించారు.
_1438971584.jpg)


--- సి.శ్రీ (దుబాయ్)
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









