ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- April 11, 2026
ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIASL) ప్యాసింజర్ సర్వీస్ ఏజెంట్స్ (ట్రైనీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విమానయాన రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను ప్రాథమికంగా షార్ట్ లిస్టింగ్ చేస్తారు. అనంతరం పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన వారు ఏప్రిల్ 17 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు విమానాశ్రయాల్లో ప్యాసింజర్ సర్వీస్ విభాగంలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
అర్హత, వయోపరిమితి, దరఖాస్తు విధానం వంటి మరిన్ని పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ http://www.aiasl.in ను సందర్శించవచ్చు. నోటిఫికేషన్ జాగ్రత్తగా చదివి గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలని సంస్థ సూచించింది.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









