ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- April 11, 2026
ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIASL) ప్యాసింజర్ సర్వీస్ ఏజెంట్స్ (ట్రైనీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విమానయాన రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను ప్రాథమికంగా షార్ట్ లిస్టింగ్ చేస్తారు. అనంతరం పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన వారు ఏప్రిల్ 17 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు విమానాశ్రయాల్లో ప్యాసింజర్ సర్వీస్ విభాగంలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
అర్హత, వయోపరిమితి, దరఖాస్తు విధానం వంటి మరిన్ని పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ http://www.aiasl.in ను సందర్శించవచ్చు. నోటిఫికేషన్ జాగ్రత్తగా చదివి గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలని సంస్థ సూచించింది.
తాజా వార్తలు
- ఫోల్డబుల్ ఫోన్ రేసులోకి యాపిల్.. ‘ఐఫోన్ డ్యుయో’ ఆవిష్కరణ
- మధు యాష్కీకి కీలక బాధ్యతలు.. ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ ఛైర్మన్గా నియామకం
- గల్ఫ్ కార్మికుల సమస్యల పై APNRT అధికారులతో చర్చ
- బ్రిటన్ నిర్ణయాన్ని స్వాగతించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఒమన్లో భారతీయ విద్యార్థుల కోసం ‘అవెనీర్ 2026’..!!
- బహ్రెయిన్లో ప్రతి 100 మందికి 150 మొబైల్ సబ్స్క్రిప్షన్లు..!!
- కువైట్లో పాఠశాలలకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో సెప్టెంబర్ 23న నేషనల్ డే సెలవు..!!
- దుబాయ్లో 999కు ఫోన్ చేస్తున్నారా?. పోలీసుల కీలక సూచన.!!
- దిగ్విజయంగా చికాగో NATS క్రికెట్ టోర్నమెంట్







