దుబాయ్ లో కృత్రిమ రెయిన్ ఫారెస్టు రెస్టారెంట్
- September 18, 2016
దుబాయ్ పేరు వింటేనే ప్రపంచంలోనే ప్రత్యేకమైన నిర్మాణాలు గుర్తొస్తాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఆకాశహర్మ్యం నుంచి.. సముద్రంలో పార్కులు నిర్మించగల నైపుణ్యం.. సృజనాత్మకత ఉన్న దేశమది. ఈ అరబ్ దేశం తాజాగా మరో భిన్నమైన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. తమ దేశంలో లేని అడవులను స్వదేశీయులకు.. పర్యాటకులకు పరిచయం చేసేందుకు అపార్టుమెంట్లోనే ఇండోర్ రెయిన్ ఫారెస్టును ఏర్పాటు చేయబోతుంది.
అపార్టుమెంట్లో కృత్రిమ రెయిన్ ఫారెస్టు(వర్షారణ్యం)ను నిర్మించే ప్రాజెక్టును చేపట్టింది దుబాయ్. హిల్టన్ అనే సంస్థ ఈ కృత్రిమ రెయిన్ ఫారెస్టు రెస్టారెంట్ను దాదాపు రూ.2వేల కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తోంది. రెండు భారీ టవర్లు నిర్మించి వాటిలో తొలి ఐదు అంతస్తుల్లో రెయిన్ ఫారెస్టును ఏర్పాటు చేస్తున్నారు. అందులో భారీ వృక్షాలు.. మొక్కలు.. జంతువులు ఉంటాయి. ఆ ప్రాంతమంతా వర్షం పడుతుంది.. శబ్ధం వినిస్తుంది. కానీ.. నీటి చుక్క మీద పడదు.ఇసుక లేకుండానే కృతిమ బీచ్ ఏర్పాటు చేస్తారట. అంతేకాదు.. పిల్లలు ఆడుకోవడాడనికి అడ్వంచర్ గేమ్స్ కూడా ఉంటాయట. అదే టవర్లలో నివసించేందుకు.. ఆఫీసులు ఏర్పాటు చేసుకునేందుకు 280 ఇళ్లు.. పర్యాటకుల బస కోసం 450 ఫ్లాట్లు నిర్మిస్తారు. 2018లో ఈ రెయిన్ ఫారెస్ట్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆ సంస్థ చెబుతోంది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







