రాస్ అల్ ఖైమాహ్ బస్సులలో... ప్రయాణిస్తూ చదువుకోండి
- September 18, 2016
రాస్ అల్ ఖైమాహ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (రాక్ టా ) ప్రయాణికులలో చదువుని ప్రోత్సహించడానికి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టింది.రాస్ అల్ ఖైమాహ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ' పఠన యాత్ర ' ప్రకారం ఎకనామిక్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సహకారంతో, ప్రయోగాత్మకంగా ప్రారంభంలో ప్రజా బస్సులలో180 పుస్తకాలకు పంపిణీ చేస్తారు. అధికార వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, ఈ పుస్తకాలు పంపిణి ప్రారంభంలో రెండు ప్రజా బస్సులలో మరియు 10 కార్లలో పంపిణీ చేయబడుతుంది. తర్వాత "ప్రతి ప్రయాణీకునికి ఒక పుస్తకం మరియు సాధారణ సమస్యలపై అవగాహన అభివృద్ధి కోసం మూడు కరపత్రాలు ఇవ్వబడతాయి. ఈ సందర్భంగా డిప్యూటీ దర్శకుడు అహ్మద్ లోబడి అల్ తుణైజి మాట్లాడుతూ, రోజూ పుస్తకాలు నవీకరించబడతాయని మరియు నెమ్మదిగా ఎక్కువ పుస్తకాలు తరువాత దశల్లో చేర్చబడుతుందని చెప్పారు. రాస్ అల్ ఖైమాహ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అరబిక్, ఇంగ్లీషు మరియు ఉర్దూ మూడు భాషల్లో ప్రచురితమైన పుస్తకాలను ప్రయాణీకులకు పుస్తకాలను ఇస్తారు. ఈ పుస్తకాల ద్వారా ప్రయాణీకుల 'జ్ఞానాభివృద్ధి కోసం' సహాయ పడతాయని మరియు వాటిని మరింత ఎక్కువ మంది చదివేలా ప్రోత్సహిస్తున్నామని వివరిస్తూ , ప్రయాణికుల తమ గమ్యస్థానం చేరిన తర్వాత తరువాత వాహనం దిగేవారు ఆ పుస్తకాన్నితిరిగి అప్పగించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







