థాయ్ లాండ్ లో ఘోర పడవ ప్రమాదం..
- September 19, 2016
థాయ్ లాండ్ లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న బోట్.. కేవో ఫ్రయా నదిలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా మరో 11 మంది గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. ఓ మసీదులో ప్రార్థనలు ముగించుకొని పడవలో తిరిగివస్తుండగా పర్యాటక నగరం ఆయుత్తాయ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో నిండిన పడవ బలమైన అలల తాకిడికి కాంక్రీట్ నిర్మాణాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.గల్లంతైన వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయుత్తాయ డిప్యూటీ గవర్నర్ రెవత్ ప్రసోంగ్ తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో 14 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. మృతుల్లో విదేశీయులెవరూ లేరని ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







