థాయ్ లాండ్ లో ఘోర పడవ ప్రమాదం..

- September 19, 2016 , by Maagulf
థాయ్ లాండ్ లో ఘోర పడవ ప్రమాదం..

థాయ్ లాండ్ లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న బోట్.. కేవో ఫ్రయా నదిలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా మరో 11 మంది గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. ఓ మసీదులో ప్రార్థనలు ముగించుకొని పడవలో తిరిగివస్తుండగా పర్యాటక నగరం ఆయుత్తాయ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో నిండిన పడవ బలమైన అలల తాకిడికి కాంక్రీట్ నిర్మాణాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.గల్లంతైన వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయుత్తాయ డిప్యూటీ గవర్నర్ రెవత్ ప్రసోంగ్ తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో 14 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. మృతుల్లో విదేశీయులెవరూ లేరని ఆయన వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com