థాయ్ లాండ్ లో ఘోర పడవ ప్రమాదం..
- September 19, 2016
థాయ్ లాండ్ లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న బోట్.. కేవో ఫ్రయా నదిలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా మరో 11 మంది గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. ఓ మసీదులో ప్రార్థనలు ముగించుకొని పడవలో తిరిగివస్తుండగా పర్యాటక నగరం ఆయుత్తాయ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో నిండిన పడవ బలమైన అలల తాకిడికి కాంక్రీట్ నిర్మాణాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.గల్లంతైన వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయుత్తాయ డిప్యూటీ గవర్నర్ రెవత్ ప్రసోంగ్ తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో 14 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. మృతుల్లో విదేశీయులెవరూ లేరని ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్









