ఏ.పి రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి విమానాశ్రయాలకు కనెక్టివిటీ...

- September 19, 2016 , by Maagulf
ఏ.పి రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి  విమానాశ్రయాలకు కనెక్టివిటీ...

రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి దేశంలో అన్ని విమానాశ్రయాలకు కనెక్టివిటీ ఏర్పాటు చేయాలని సివిల్‌ ఏవియేషన డైరెక్టర్‌ ఆర్‌.ఎన.చౌబేను సీఎం చంద్రబాబు కోరారు. రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకు దేశంలోని ప్రాంతీయ విమాన అనుసంధానంపై ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా, సివిల్‌ ఏవియేషన్‌, ఏపీ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాలపై సీఎం చంద్రబాబు, ఏవియేషన్‌ డైరెక్టర్‌ చౌబే సమక్షంలో అధికారులు సంతకాలు చేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీలో నేషనల్‌ ఏవియేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
రాషా్ట్రనికి అంతర్జాతీయ విమానాలు ఎక్కువగా వచ్చేలా చేయాలని చౌబేకి సూచించారు. ఏపీలో మరో ఆరు విమానాశ్రయాల ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియ ప్రారంభిస్తున్నామని చంద్రబాబు ఏవియేషన్‌ అధికారులకు తెలిపారు. విశాఖలో ఏవియేషన్‌ ఆధ్వర్యంలో పైలట్‌ టె్త్రనింగ్‌ సెంటర్‌ ఏర్పాటుపై సీఎం సూచనపై ఏవియేషన్‌ డైరెక్టర్‌ చౌబే సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు, సివిల్‌ ఏవియేషన్‌ జాయింట్‌ సెక్రటరీ అనిల్‌ శ్రీవాత్సవ, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ గురుప్రసాద్‌ మహాపాత్రో పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com