ఏ.పి రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి విమానాశ్రయాలకు కనెక్టివిటీ...
- September 19, 2016
రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి దేశంలో అన్ని విమానాశ్రయాలకు కనెక్టివిటీ ఏర్పాటు చేయాలని సివిల్ ఏవియేషన డైరెక్టర్ ఆర్.ఎన.చౌబేను సీఎం చంద్రబాబు కోరారు. రాజమహేంద్రవరం ఎయిర్పోర్టుకు దేశంలోని ప్రాంతీయ విమాన అనుసంధానంపై ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా, సివిల్ ఏవియేషన్, ఏపీ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాలపై సీఎం చంద్రబాబు, ఏవియేషన్ డైరెక్టర్ చౌబే సమక్షంలో అధికారులు సంతకాలు చేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీలో నేషనల్ ఏవియేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
రాషా్ట్రనికి అంతర్జాతీయ విమానాలు ఎక్కువగా వచ్చేలా చేయాలని చౌబేకి సూచించారు. ఏపీలో మరో ఆరు విమానాశ్రయాల ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియ ప్రారంభిస్తున్నామని చంద్రబాబు ఏవియేషన్ అధికారులకు తెలిపారు. విశాఖలో ఏవియేషన్ ఆధ్వర్యంలో పైలట్ టె్త్రనింగ్ సెంటర్ ఏర్పాటుపై సీఎం సూచనపై ఏవియేషన్ డైరెక్టర్ చౌబే సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, సివిల్ ఏవియేషన్ జాయింట్ సెక్రటరీ అనిల్ శ్రీవాత్సవ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ గురుప్రసాద్ మహాపాత్రో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ రక్షణ దళాల చర్య: బాలిస్టిక్ క్షిపణి, రెండు డ్రోన్లు నిర్వీర్యం
- గ్యాస్ వినియోగదారులకు షాక్
- విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష
- రాత్రి సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సౌండ్ లో మార్పు
- అబుదాబి నుండి భారత్కు ఎతిహాద్ విమానాలు–నేటి షెడ్యూల్
- మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!
- అత్యవసర హెచ్చరికలు.. ప్రజలకు సౌదీ అరేబియా అప్పీల్..!!
- ఒమన్లో CBSE విద్యార్థుల పై పరీక్షల ఒత్తిడి..!!
- మిడిలీస్టు సంక్షోభం.. 40వేలకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్..!!









