ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య పీటముడిగా మారిన జలవివాదాలు..
- September 21, 2016
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య పీటముడిగా మారిన జలవివాదాలు పరిష్కారం దిశగా ఢిల్లీలో తొలి అడుగు పడింది. రాష్ట్ర విభజన తర్వాత అపెక్స్ కౌన్సిల్ భేటీ అవడం ఇదే తొలిసారి. కేంద్ర జలవనరుల శాఖమంత్రి ఉమాభారతి అధ్యక్షతన మొదలైన ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ హాజరయ్యారు. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో ఈ సమావేశం జరుగుతోంది.ముందుగా కేంద్రమంత్రి ఉమాభారతి ఇద్దరు ముఖ్యమంత్రులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ తరపున ఐదుగురు సభ్యులు మాత్రమే రావాలని మొదట చెప్పినప్పటికీ ఎంపీలు, సెక్రెటరీలు, అధికారులను కూడా ఈ సమావేశానికి అనుమతించారు. సుమారు 40మందికి పైగా సమావేశానికి హాజరయ్యారు. కమిటీ రూమ్లో తొలుత కృష్ణానదీ యాజమాన్య బోర్డు అధికారుల ప్రజెంటేషన్ కొనసాగింది.అనంతరం ఏపీ ప్రభుత్వం తరపున సాగునీటి పారుదలశాఖ కార్యదర్శి శశిభూషణ్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పది నిమిషాల పాటు ప్రజెంటేషన్ కొనసాగింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తరపున సాగునీటి పారుదలశాఖ కార్యదర్శి ఎస్కే జోషి తన ప్రజెంటేషన్ను ఇస్తున్నారు. అనంతరం అజెండాలోని అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.సమావేశానికి ముందు ఇద్దరు సీఎంలు వేర్వేరుగా కేంద్రమంత్రి ఉమాభారతిని మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు. అక్కడే ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకరినొకరు అభివాదం చేసుకున్నారు.
తాజా వార్తలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!









