తమిళనాడులో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంటు ..!!
- September 21, 2016
ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంటును 648 మెగావాట్ల స్థాపక సామర్థ్యంతో అదాని గ్రూపు తమిళనాడులో నిర్మించింది. రామనాథపురం జిల్లాలోని కముధి వద్ద దీన్ని ఈరోజు ప్రారంభించారు. సబ్స్టేషన్ ద్వారా దీనిని గ్రిడ్కు అనుంసంధానిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బుధవారం అధికారికంగా ప్రారంభించారు. 5వేల ఎకరాల విస్తీర్ణంలో రూ.4,550 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. నిర్మాణానికి కావాల్సిన పరికరాలు, యంత్రాలను వివిధ దేశాల నుంచి సమకూర్చి 8 నెలల్లో ప్లాంటును పూర్తి చేశారు. నిర్దిష్ట సమయంలో నిర్మాణాన్ని పూర్తి చేయడానికి రోజుకి 8,500 మంది కార్మికులు పని చేశారు. ఈ ప్లాంటు 3.8 లక్షల ఫౌండేషన్లు, 25లక్షల సోలార్ మాడ్యూల్స్, 576 ఇన్వర్టర్లు, 154 ట్రాన్స్ఫార్మర్లు, 6వేల మీటర్ల పొడవు గల కేబుల్స్ను కలిగి ఉంది. ఈ ప్లాంటు నిర్మాణం తమిళనాడుకే కాక మొత్తం దేశానికే చిరస్మరణీయ సందర్భమని అదాని గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదాని తెలిపారు. ఈ విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రభుత్వం అందించిన సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







